Mar
14
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౧
ఆస్తీక చరితము- చ్యవనుని వలన బులోముఁ డనురాక్షసుండు చచ్చుట
అప్పుడు శౌనకాది మునులు రౌమహర్షుణునితో సర్పములకు జనమేజయుడు చేయు సర్పయాగములో అగ్నిలో పడుటకు గల కారణాన్ని వివరించమని అడుగుతారు.126
వ.
అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పెఁ దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబున జేసి జనమేజయసర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్ని యందు సర్పంబుల కెల్ల నకాండ ప్రళయం బైన దాని భృగువంశజుం డైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు జరత్కార సుతుం డైన యాస్తీకుం డుడిగించె దీనిని సవిస్తరంబుగాఁ జెప్పెద దత్తావధాను లరై వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకు చరితంబును జెప్పందొడంగె. 128
సీ.
భృగుఁ డనువిప్రుండు మగువఁ బులోమ యన్ దాని గర్భిణిఁ దనధర్మపత్ని
నగ్ని హోత్రమునకు నగ్నులు విహరింపు మని పంచి యభిషేచనార్థ మరుగ
నంతఁ బులోముఁ డన్ వింతరక్కసుఁ డగ్ని హోత్రగృహంబున కొయ్య వచ్చి
యత్తన్విఁ జూచి యున్నత్ముఁ డై యెవ్వరిసతి యిది సెప్పుమా జాతవేద
ఆ.వె.
యనఁగ నగ్ని దేవుఁ డనృతంబునకు విప్ర,శాపమునకు వెఱచి శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁదీర్ప రాదనృతాభిభాషణము నైన పాపచయము.౧౨౯
వ.
అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన నప్పులోముండు నిది నాకు దొల్లి వరియింపబడినభార్య పదంపడి భృగుండు పెండ్లి యయ్యె నని వరాహరూపంబున నాసాధ్వి నతిసాధ్వతచిత్త నెత్తికొని పర్వం బర్వం దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై చ్యవనుండు నాఁ బరఁగె
నమ్మునికుమారుని.౧౩౦
క.
సముదితసూర్యసహస్రో, పమదుస్సహతేజు జగదుపప్ల వ సమయా
సమదీప్తి తీవ్రపావక, సముఁజూచుచు నసుర భస్మ సాత్క్రుతుఁడ య్యెన్.౧౩౧
వ.
పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె. ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుచుం బోయినఁ దద్బాష్ప ధారా ప్రవాహంబు మహానదియై తదాశ్రమ సమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోనిబాలకు నెత్తికొని యేడ్చుచున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర ని న్నెట్లెఱింగె నెవ్వరు సెప్పి రనిన విని పులోమ యి ట్లనియె.
క.
ఈ యగ్ని దేవుఁ డసురకు, నోయనఁ జెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర, మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్.౧౩౩
క.
కుక్షిచ్యుతుఁ డై సుతుఁ డా, రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
రక్షించె నన్ను ననవుడు, నా క్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.౧౩౪
వ.
నీ వతి క్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపంబిచ్చిన నగ్ని దేవుం డి ట్లనియె.౧౩౫
క.
తనయెఱిఁగిన యర్థం బొరుఁ, డనఘా యిదియెట్లు సెప్పుమని యడిగిన జెఁ
ప్పనివాడును సత్యము సె,ప్పనివాఁఢును ఘోరనరకపంకమునఁ బడున్.౧౩౬
వ.
కావున నే నసత్య భయంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కలరూపుఁ జెప్పితి నఖిలజగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీ నోపిన వాఁడనుగాను వినుము.
ఆస్తీక చరితము- చ్యవనుని వలన బులోముఁ డనురాక్షసుండు చచ్చుట
అప్పుడు శౌనకాది మునులు రౌమహర్షుణునితో సర్పములకు జనమేజయుడు చేయు సర్పయాగములో అగ్నిలో పడుటకు గల కారణాన్ని వివరించమని అడుగుతారు.126
వ.
అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పెఁ దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబున జేసి జనమేజయసర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్ని యందు సర్పంబుల కెల్ల నకాండ ప్రళయం బైన దాని భృగువంశజుం డైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు జరత్కార సుతుం డైన యాస్తీకుం డుడిగించె దీనిని సవిస్తరంబుగాఁ జెప్పెద దత్తావధాను లరై వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకు చరితంబును జెప్పందొడంగె. 128
సీ.
భృగుఁ డనువిప్రుండు మగువఁ బులోమ యన్ దాని గర్భిణిఁ దనధర్మపత్ని
నగ్ని హోత్రమునకు నగ్నులు విహరింపు మని పంచి యభిషేచనార్థ మరుగ
నంతఁ బులోముఁ డన్ వింతరక్కసుఁ డగ్ని హోత్రగృహంబున కొయ్య వచ్చి
యత్తన్విఁ జూచి యున్నత్ముఁ డై యెవ్వరిసతి యిది సెప్పుమా జాతవేద
ఆ.వె.
యనఁగ నగ్ని దేవుఁ డనృతంబునకు విప్ర,శాపమునకు వెఱచి శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁదీర్ప రాదనృతాభిభాషణము నైన పాపచయము.౧౨౯
వ.
అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన నప్పులోముండు నిది నాకు దొల్లి వరియింపబడినభార్య పదంపడి భృగుండు పెండ్లి యయ్యె నని వరాహరూపంబున నాసాధ్వి నతిసాధ్వతచిత్త నెత్తికొని పర్వం బర్వం దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై చ్యవనుండు నాఁ బరఁగె
నమ్మునికుమారుని.౧౩౦
క.
సముదితసూర్యసహస్రో, పమదుస్సహతేజు జగదుపప్ల వ సమయా
సమదీప్తి తీవ్రపావక, సముఁజూచుచు నసుర భస్మ సాత్క్రుతుఁడ య్యెన్.౧౩౧
వ.
పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె. ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుచుం బోయినఁ దద్బాష్ప ధారా ప్రవాహంబు మహానదియై తదాశ్రమ సమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోనిబాలకు నెత్తికొని యేడ్చుచున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర ని న్నెట్లెఱింగె నెవ్వరు సెప్పి రనిన విని పులోమ యి ట్లనియె.
క.
ఈ యగ్ని దేవుఁ డసురకు, నోయనఁ జెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర, మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్.౧౩౩
క.
కుక్షిచ్యుతుఁ డై సుతుఁ డా, రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
రక్షించె నన్ను ననవుడు, నా క్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.౧౩౪
వ.
నీ వతి క్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపంబిచ్చిన నగ్ని దేవుం డి ట్లనియె.౧౩౫
క.
తనయెఱిఁగిన యర్థం బొరుఁ, డనఘా యిదియెట్లు సెప్పుమని యడిగిన జెఁ
ప్పనివాడును సత్యము సె,ప్పనివాఁఢును ఘోరనరకపంకమునఁ బడున్.౧౩౬
వ.
కావున నే నసత్య భయంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కలరూపుఁ జెప్పితి నఖిలజగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీ నోపిన వాఁడనుగాను వినుము.