Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౮
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కృత మెఱిఁగి కర్త నుత్తమ, మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు, పతియె జగజ్జనులనెల్లఁ బరిపాలించున్.౪౬

చేయదగినది తెలిసికొని కర్తను సభలలో బాగుగా పొగడి మర్చిపోకుండా తగిన సత్కారమును చేస్తున్నావు గదా. చేయదగినదానిని తెలుసుకున్న రాజే జగాలనన్నీ పరిపాలించగలుగుతాడు.
సీ.
ఆయంబునందు నాలవభాగమొండె మూఁడవభాగమొండె నం దర్థమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవనినాథ యాయుధాగారధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందుఁ బరమవిశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య
ఆ.
గురుల వృద్ధశిల్పివరవణిగ్బాంధవ, జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదరికము వొరయకుండఁగఁ బ్రోతె, సకలజనులు నిన్ను సంస్తుతింప.౪౭
ఆదాయంలో నాల్గవభాగం ఆయుధాగార ధనాగారముల నిర్వహణకు, మూడవభాగాన్ని సైన్యాన్నిఅశ్వదళ నిర్వహణకు,
ఒకటిన్నర భాగాన్ని గజసైన్యనిర్వహణయందు ఖర్చుపెట్టాలి కాని అంతకు మించి ఖర్చు పెట్టరాదనే విషయం గ్రహించావు గదా. ధనాగార నిర్వహణలో దక్షులను భక్తులను పరమ విశ్వాసం గలవారినే నియమించుకొన్నావుగదా.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౨
శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట
తే.
జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు, లామిషం బెట్లు భక్షించునట్లుదివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల, ననుదినంబును భక్షింతు రర్థవంతు.౨౭

నీటిలో చేపలు, ఆకాసములో పక్షులు మాంసాన్ని తినేటట్లుగా అందరూ చేరి డబ్బుకలవాణ్ణి ఎల్లప్పుడూ తింటూ ఉంటారు.
క.
అర్ధమ యనర్థమూలం, బర్థమ మాయావిమోహనావహము నరుం
డర్ఠార్జనదుఃఖమున న, పార్థీ కృత జన్ము డగుట పరమార్థ మిలన్.౨౮
అపార్థీకృతజన్ముడు=నిరర్థకమగు జన్మ కలవాడు

ధనము అనర్థాలకి మూలం. ధనము మాయావి , మోహాన్ని కలిగించేది. నరుడు ధనసంపాదనార్థం కలిగే దుఃఖం వల్ల నిరర్ధకమైన జన్మ కలవాడగుచున్నాడు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౩
ఉపరిచర వసు మహారాజు వృత్తాంతము
వ.
అట్టి యింద్రోత్సవంబున నతి ప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రధ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱు వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుడయి రాజర్షియయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపంబున బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతియై గిరినిరోధంబుంబాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నింగాఁ జేకొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టుమని తనపితృదేవతలు పంచిన నప్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.౨౬
భారతం లోని ఈభాగాన్ని ఆధారంగా చేసుకుని వసుచరిత్ర కావ్యం రామరాజభూషణునిచే వ్రాయబడిందని చెప్తారు.
సీ.
పలుకులముద్దును గలికి క్రాల్గన్నుల తెలుపును వలుదచన్నుల బెడంగు
నలఘు కాంచీపదస్థలములయొప్పును లలితాననేందు మండలము రుచియు
నళినీల కుటిల కుంతలముల కాంతియు నెల జవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలపును గలుగు నగ్గిరికన తలఁచి తలఁచి
ఆ.వె.
ముదితయందుఁ దనదుహృదయంబు నిలుపుటఁ, జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద,మయ్యె నవనిపతికి నెయ్యమొనర.౨౭
రేతఃస్యందము=ఇంద్రియము పడుట
ఈ రేతస్సునుండి అద్రిక అనే అప్సరస ద్వారా మత్స్యరాజు,మత్స్యగంధి అనే ఇద్దరు పుట్టడం జరుగుతుంది.