Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౬
వ.
అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.
క.
ఆదిత్య దైత్య దానవు, లాదిగఁ గల భూతరాశి కగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ,ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగాన్
.౫౮

దేవ దానవ ప్రముఖుల యత్పత్తి క్రమము
బ్రహ్మ----(మానస పుత్రులు)------6గురు. మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు.
మరీచి---కశ్యప ప్రజాపతి----చరాచర భూతరాశి ఉద్భవమయ్యింది.
బ్రహ్మ---దక్షిణ అంగుష్ఠం---దక్షుఁడు(పు)
బ్రహ్మ---వామాంగుష్ఠం-----ధరణి(స్త్రీ)
దక్షుడు+ధరణి----౧౦౦౦ సుతులు ---సాంఖ్యయోగాభ్యాసంతో ముక్తులై ఊర్ధ్వరేతస్కులు అయ్యారు.
దక్షుడు+ధరణి----౫౦ మంది కుమార్తెలు కలిగారు
ఈ ౫౦ మందిలో ౧౦ మందిని ధర్ముడనే మనువుకిచ్చి వివాహం చేస్తాడు.
ఈ ౧౦ మంది పేర్లు కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్ఠి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి .
౨౭ మందిని(అశ్విని,కృత్తిక,రోహిణి---మొదలగువారు) చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు.
౧౩ మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు.వీరి వివరాలు.
అదితికి---ద్వాదశాదిత్యులు (ధాతృ, మిత్ర, అర్యమ, శక్ర, వరుణ, అంశు, భగ, వివస్వత, పూష, సవితృ, త్వష్టృ, విష్ణువు)
దితి---హిరణ్య కశిపుడు ----అతనికి 5గురు పుట్టారు(ప్రహ్లాద, సంహ్లాద, అనుహ్లాద, శిబి, బాష్కళుడు)
(-----ప్రహ్లాదునికి---విరోచన, కుంభ, నికుంభు లని ముగ్గురు కలుగుతారు.
-----విరోచనునికి----బలి----బలికి---బాణాసురుడు.)
దనువు-- ౪౦ మంది దానవులు పుడతారు (విప్రచిత్తి, శంబర, నముచి, పులోమాసి, లోమకేశి, దుర్జయ మొదలగువారు)
ఈ దానవుల పుత్ర,పౌత్ర సంతానం అసంఖ్యాకంగా పెరుగుతుంది.
కాల---8గురు పుడతారు(వినాశన, క్రోధ మొదలయినవారు)
అనాయువు---4గురు ముదిమి లేనివారు పుడతారు.(విక్షర, బల, వీర, వృత్రుడు)
సింహిక---రాహువు
ముని----౧౬ గురు గంధర్వులు పుడతారు(భీమసేన, ఉగ్రసేన, మొదలయినవారు)
కపిల---- అమృతం, గోగణం, బ్రాహ్మణులు, ఘృతాచీ, మేనక మొదలుగాగల అప్సరోగణం పుడతారు.
వినత---అనూరుడు, గరుడుడు
(-------అనూరుడు+శేని--సంపాతి, జటాయువు పుడతారు.
క్రోధ---క్రోధవశగణం
బ్రాధ---సిద్ధాదులు పుడతారు.
క్రూర---సుచంద్ర, చంద్రహంతాదులు పుడతారు.
కద్రువ---భుజంగముఖ్యులు పుడతారు(శేష, వాసుకి, మున్నగువారు)

బ్రహ్మ మానసపుత్రుడైన అంగిరసునకు----అయ్యుతథ్యుడు, బృహస్పతి(దేవగురువు), సంవర్తుడు అనే ముగ్గురు కొడుకులు, గుణాశ్రయయోగసిద్ధి అనే కూతురు పుట్టారు.
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి అనేకమంది పరమమునులు పుట్టారు.
పులస్త్యుడనే మానసపుత్రునకు అనేకమంది రాక్షసులు పుట్టారు.
పులహుండనే మానసపుత్రునకు కిన్నరులు, కింపురుషులు పుట్టారు.
క్రతు వనే మానసపుత్రునకు పతంగసహచరులు పుట్టారు.
పైతామహుడైన దేవుండనే మనువునకు ప్రజాపతి పుట్టాడు.
ఈ ప్రజాపతికి 7గురు భార్యలు. ఆ ఏడుగురు భార్యలకు వరుసగా---
ధూమ్రకు ధరుండు
బ్రహ్మవిద్యకు ధృవుండు
మనస్వినికి సోముడు
రతకు నహుడు
శ్వసకు అనిలుడు
శాండిలికి అగ్ని
ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులనే ఎనమండుగురు వసువులు పుడతారు.
  • ధరుండనే వసువుకు ద్రవిణుడు, హుతహవ్యవాహనుడు
  • ధ్రువుండు అనే వసువుకు కాలుడు పుట్టె.
  • సోముండనే వసువుకు (భార్య మనోహర) వర్చసుండు, శిశిరుండు, ప్రాణుండు, రమణుండు, మరియు పృథ అనే కూతురూ కలిగారు. ఆ పృథకు ౧౦ మంది గంధర్వపతులు పుట్టారు.
  • యహుండను వసువుకు జ్యోతి పుట్టింది
  • అనిలుండు అనే వసువునకు (భార్య శివ) మనోజవుడు, అవిజ్ఞాతగతి పుట్టారు.
  • అగ్ని అనే వసువునకు కుమారుడు పుట్టాడు.
  • ప్రత్యూషుడనే వసువునకు దేవలుడు (ఋషి)
  • ప్రభాసుడనే వసువునకు(భార్య బృహస్పతి చెల్లెలు ఐన యోగసిద్ధికి) విశ్వకర్మ పుడతాడు.(గొప్ప శిల్పి)
స్థాణునికి ఏకాదశమానసపుత్రులు మృగ, వ్యాధ, శర్వ, నిరృత, ఏకపాద, అహిర్భుధ్న్య, పినాకి, దహనేశ్వర, కపాలి, స్థాణు, భర్గులు .
బ్రహ్మ దక్షిణ స్థనము---ధర్ముండనే మనువు-----శమ, కామ, హర్షులు అనే ముగ్గురు పుట్టారు.
శమ(భార్య ప్రాప్తి), కామ(భార్య రతి), హర్ష(బార్య నంద)
సవితృ(భార్య బడబారూపధారిణి యైన త్వాష్ట్రి)---ఆశ్విని మొదలగువారు పుట్టారు.
బ్రహ్మ హృదయం నుండి భృగుమహర్షి----కవి-----శుక్రాచార్యులు(రాక్షస గురువు)----చండామర్కులు, త్వష్ట్ర, ధర, అత్రు లనే 4గురు పుట్టారు.(అసురులకు యాజ్ఞికులు)
భృగుడు--చ్యవనుడు(భార్య మనుకన్య)---ఊరుల ద్వారా ఔర్యుడు---100మంది ఋచీకుడు మొదలగువారు పుట్టారు.
ఋచీకుడు---జమదగ్ని-----4గురు కొడుకులు పరశురాముడు మొదలగువారు
బ్రహ్మ ---ధాత, విధాత (మనుసహాయులుగా పుట్టారు) వారితో పాటు లక్ష్మి --అనేకమంది మానస పుత్రులు పుట్టారు.
వరుణునకు జ్యేష్టకు బలుడు, సుర అనే కూతురు---అధర్ముడు(భార్య నిరృతి)--భయ, మహాభయ, మృత్యువు 3గ్గురు.
తామ్ర---5గురు కుమార్తెలు కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి.
కాకి---ఉలూకంబులు , శ్యేని---శ్యేనంబులు(డేగలు), బాసి---భాస గృధాదులు, ధృతరాష్ట్రికి--హంస చక్రవాకములు, శుకి---శుకంబులు,
క్రోధుడు---9గురు మృగి, మృగమంద, హరి, భద్రమనస, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస.
  • మృగి---మృగంబు
  • మృగమంద---ఋక్ష చమర సృమరాదులు
  • హరి---వానర గణములు
  • భద్రమనస----ఐరావణము---దేవనాగంబులు
  • మాతంగి-----గజములు
  • శార్దూలి----సింహ వ్యాఘ్రంబులు
  • శ్వేత---దిగ్గజములు
  • సురభి---రోహిణి, గంధర్వి,ననల పుట్టారు. రోహిణికి పశుగణము, గంధర్వికి హయములు, ననలకు గిరివృక్షలతాగుల్మంబులు పుట్టినవి
  • సురస---సర్పంబులు. ఇది సర్వ భూత సంభవ ప్రకారము.౭౧
చ.
దివిజ మునీంద్ర దానవ దితిప్రభవాది సమస్త భూత సం
భవముఁ గృతావధానులయి భక్తి మెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులు జిరా
యువును బహుపుత్ర లాభ విభవోన్నతియున్ దురితప్రశాంతియున్.72
దురితప్రశాంతి=పాపశమనము
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౫
భీష్మాది వీరులు దేవదానవాదుల యంశంబు వలనఁ బుట్టుట
సీ.
పరశురాముండు భీకరనిజకోపాగ్ని నుగ్రుఁ డై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్రంబు సేసినఁ దత్క్షత్త్ర సతులు సంతాన కాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్క్షత్త్రమెసఁగి యుర్వి
ఆ.
బర్వి రాజధర్మ పథనీతి విడువక, జార చోర దుష్ట జనులబాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ, జేయుచుండె శిష్ట సేవ్యమగుచు.౫౧
పరశురాముడు ఇరవై వొక్క మాఱులు భూలోకమంతా తిరిగి క్షత్రియులందరిని చంపివేసినపుడు ఆ క్షత్రియ స్త్రీలు ఋతుకాలములో మహావిప్రులవలన ధర్మము తప్పకుండా అనేకమంది కొడుకులను కూతుళ్ళను కన్నారు. వారంతా రాజధర్మాన్ని విడిచిపెట్టకుండా జార చోర దుష్టజనుల బాధ లేకుండా పరిపాలన చేయగా సకల సస్యసమృద్ధి ప్రజాభివృద్ధి జరిగి భూదేవి ప్రజాభారపీడిత అయ్యింది. ఆమె త్రిమూర్తులను భూభారం తగ్గించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు దేవ రాక్షసాంశమ్ములతో పాండవపక్ష వీరులను శిశుపాలాదులు మొదలుగాగల కురురాజుపక్ష రాజులను సృష్టి చేయగా వారందరు భారత సంగ్రామంలో ఒకరితో ఒకరు యుద్ధం చేసి చచ్చిపోతారు. ఆ విధంగా భూభారం తగ్గుతుంది.

బ్లాగ్మిత్రులందరికీ విన్నపం.
--౨౦౦౯ నుండి ప్రారంభించి భక్తి టీ.వి. వారు ప్రతిరోజు రాత్రి గంటలకు, తిరిగి రాత్రి ౧౧ గంటలకు బ్రహ్మశ్రీ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానంతో శ్రీమదాంధ్రమహాభారతాన్ని ప్రసారం చేస్తున్నారు. వీలైతే చూడగలరు.