Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౪
మత్స్యగంధి వృత్తాంతము, శ్రీ వేదవ్యాస మునీంద్రుని అవతారము
సీ.
చపలాక్షి చూపులచాడ్పున కెద మెచ్చుఁ జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీఁగయందంబు మది నిల్పు జఘనతలంబుపైఁ జరుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు వేడ్కతో మఱుమాట వినఁగఁదివురు
నతి ఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
ఆ.వె.
నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు, లయ్యుఁగడువివిక్త మయిన చోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ, గాముశక్తి నోర్వఁగలరె జనులు.౩౮
పరాశర మహర్షి ఒకసారి మత్స్యకన్య యైన సత్యవతి యేకవస్త్రయై ఓడనడుపుతూ ఉన్నపుడు ఆమె జన్మరహస్యం
దివ్యదృష్ఠితో నెఱిఁగిన వాడై ఆమెయందు మదనపరవశుడయ్యి ఆమె ఓడ నెక్కి ఆ విధంగా ప్రవర్తించాడట.
ఉ.
సంచితపుణ్యుఁ డంబురుహ సంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారత సంహితఁ జేసె నున్నతిన్.౪౭
సత్యవతి యందు పరాశరమునికి సద్యోగర్భంబున వేదవ్యాస మహర్షి జన్మిస్తాడు. ఆ వేదవ్యాసుడే వేదవాజ్ఞ్మయాన్ని విభాగించి లోకములలో వ్యాప్తి నొందించి సమస్తలోకాలకు హితవు గూర్చేట్లుగా పంచమ వేదమైన భారత సంహితను నిర్మిస్తాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౯
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
వలయు నమాత్యులుఁ జుట్టం,బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం
సులు బలసి యుండ నిచ్చలుఁ, గోలువుండుదె లోకమెల్లఁ గొనియాడంగన్.౪౮
క.
పరికించుచు బాహ్యాభ్యం,తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్.౪౯
బయటను లోనను ఉన్న జనుల వలన ఎల్లప్పుడూ జాగరూకుడవై నీ రక్షణను చూసుకుంటూ ఇతర రాజుల కదలికల్ని నేర్పరులైన చారులనెడు కన్నులతో గమనిస్తున్నావు గదా.
క.
వెలయఁగ విద్వజ్జనము,ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార,మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.౫౦
ఆ.వె.
వార్తయందు జగము వర్తిల్లు చున్నది, యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింప వలయుఁ బతికి.
వార్త=అర్థానర్థవివేచన విద్య
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౩
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.