Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౯
కౌరవ వంశ వివరణము
చ.
నిరుపమ ధర్మమార్గపరినిష్ఠితు లై మహినెల్లఁ గాచుచుం
బరఁగినతొంటిపూరు కురుపాండుమహీశుల పేర్మిఁ జేసి భూ

భరవహనక్షమం బగుచుఁ బౌరవకౌరవపాండవాన్వయం

బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్తజగత్ప్రసిద్ధమై.
౮౮

దక్షుని కూతురు అదితి+కశ్యప ప్రజాపతి-----వివస్వంతుడు----వైవస్వతుడు(మనువు)---యముడు, శనైశ్చరుడు, యమున, తపతి పుట్టారు.
వైవస్వతుడు-----బ్రహ్మ క్షత్త్రియ వైశ్య శూద్రాదులైన మానవులు పుట్టిరి. ఇంకా వేనుడు మొదలుగాగల ౫౦ మంది రాజులు పుట్టి వంశకరులై తమలోన తాము యుద్ధం చేసి చనిపోయారు.
వైవస్వతుడు---ఇల(పుత్రిక)+బుధుడు(సోమపుత్రుడు)---పురూరవుడు . ఇతడు చక్రవర్తియై పాలించి ధనలోభముతో విప్రోత్తముల ధనాన్నపహరిస్తాడు. దానిని సరిచేయాలని సనత్కుమారుడు ముని సంఘంతో బ్రహ్మలోకాన్నుండి వస్తే వారికి దర్శనం ఇవ్వడు. అప్పుడు వారతనిని ఉన్మత్తుడుగా కమ్మని శపిస్తారు.
ఈ పురూరువునకు ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, నమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అని 6గురు కలుగుతారు.
ఆయువునకు స్వర్భానవి యనుదానికి నహుషుడు, వృద్ధశర్మ, రజుడు, గయుడు, ఏనసుడు, అని 5గురు పుడతారు.
వీరిలో నహుషుడు చక్రవర్తి అవుతాడు. నూఱు క్రతువులు చేసి దేవేంద్రత్వాన్ని కూడా పొందుతాడు.
ఈ నహుషునకు ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, యాయాతి, త్యయతి, ధృవుడు ఇలా 6గురు
పుడతారు.
వీరిలో యయాతి రాజై అనేక యాగములు చేసి శుక్రపుత్రి యయిన దేవయాని యందు యదు తుర్వసులను ఇద్దఱు కొడుకులను, వృషపర్వపుత్రి యయిన శర్మిష్ఠ యందు ద్రుహ్య, అను, పూరుడు అని 3గ్గురు కొడుకులను కంటాడు.యయాతి తఱువాత శుక్ర శాపం వలన జరాభారపీడితుడవుతాడు. అప్పుడు నహుషుడు కొడుకులనందరినీ పిలిచి ఇలా అంటాడు.
సీ.
విషయోపభోగాభింషణ మింకను నాకు వదలక పెరుగుచున్నదియుఁ గాన
నందనులార మీయం దొక్క రుండు నా దగుజరాభారంబు దగిలి తాల్చి
తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వఁ డీ నోపు నాతండ సద్వీపసకల
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు నని యడిగిన నగ్ర తనయుఁ డయిన
ఆ.
యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక, తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి
పనుపుఁ జేసి ముదిమిగొని జవ్వనంబిచ్చెఁ, బూరుడనుసుతుండు భూరియశుఁడు.