Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౪
దేవతలు నహుషుని సురరాజ్యాభిషిక్తునిం జేయుట
తే.
శరణు చొచ్చిన రక్షింపఁ జాలియుండి, కడపి పుచ్చిన నూర్థ్వలోకములు దప్పుఁ
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె, కమలగర్భుండు తొల్లి జగద్ధితముగ.౧౬౧
కమలగర్భుండు=బ్రహ్మ

బ్రహ్మ హత్యా పాతకం వలన నీచ దశకు వచ్చిన ఇంద్రుడు నిషధాచలానికి వెళ్ళి అక్కడే దాగి వుంటాడు. దేవతలు, మునులూ కలసి మానవలోకం లోని నహుషుణ్ణి ఇంద్రపదవిని చేపట్టమని కోరతారు. ఆతడు ఇంద్రపదవిని అధిష్టించటానికి వీలు కలిగేలా యమవరుణాది త్రిదశులు, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరాది వారందరి దగ్గరనుంచి కొంత కొంత తేజో విశేషములను గ్రహించి బహు బలవంతుడౌ తాడు. కొంతకాలానికి నహుషుడు మదమెక్కిన వాడై ఇంద్రుని భార్య యైన శచీదేవిని పొందగోర్తాడు. అతడామెకు కబురుపెట్టగా ఆమె భయకంపితయై దేవగురువైన బృహస్పతిని శరణు వేడుతుంది. నహుషుడు ఇది తెలిసి దేవగురువు ఇలా ఆమెకు తన ఇంటిలో ఆశ్రయం ఇవ్వటం తప్పు అని అంటాడు. పైగా ఇంద్రుడు అహల్యని కోరినప్పుడు మీరతనికి ఇలా ఎందుకు బుద్ధి చెప్పలేదు అని మునులతో వాదిస్తాడు. అప్పుడా మునులందరూ శచీదేవిని నహుషుని దగ్గఱకు తీసుకువద్దామనే ఉద్దేశ్యంతో బృహస్పతి దగ్గరికి వెళ్తారు. వారందరూ నహుషుడు ఇంద్రపదవిలో ఉన్నాడు కాబట్టి శచీదేవి అతనిదగ్గరకు రావటం లో తప్పులేదంటారు. శచీదేవి అలా అయితే మీరంతా నన్ను శుచివని అనే వాక్యం అబద్ధమోతుందిగదా అని అంటుంది.ఆ సమయంలో బృహస్పతి
వ.
అనిన విని దరహసితవదనుం డగుచుఁ బురుహితబురోహితుండు.౧౫౮
క.
నహుషుండు పనుచువాఁ డటె, విహితానుష్ఠానపరులు వీ రటె తాలో
కహితం బటె యిది మనకున్, మహనీయమ కాక యెట్లు మానఁగ వచ్చున్.౧౫౯
వ.
అని యుల్లసం బాడి యనిమిషులను రుషులను జూచి యిట్లనియె.౧౬౦
తే.
శరణు చొచ్చిన రక్షింపఁ జాలియుండి, కడపి పుచ్చిన నూర్థ్వలోకములు దప్పుఁ
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె, కమలగర్భుండు తొల్లి జగద్ధితముగ.౧౬౧

అలా అని బృహస్పతి అడ్డు చెప్పగా అందరూ కలసి ఆలోచించి శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి అతడిని కలియటానికి కొంత గడువు కోరి రావటం మంచిదంటారు. శచీదేవి అలానే వెళ్ళి కొంత గడువు కోరి వస్తుంది.