Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-5
కౌరవ పాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టఁ జనుట
ద్రోణుడు తన శిష్యులతో నాకు గురు దక్షిణగా ద్రుపదుని పట్టి తెండని అడిగాడు. అప్పుడు అదెంతపని అని తలచి కురుకుమారులందరూ పాంచాలపురాన్ని ముట్టడించారు.
పాండవులును రథంబు లెక్కి ద్రోణుం పిఱుంద నరిగి రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.
క.
వడిగొని కౌరవు లొండొరుఁ, గడవఁగ మును చనిరి వారిగర్వము సూడం
గడిమినిద్రుపదాధిపుతోఁ, బొడవఁగ దమ కలవి యగునె భుజవీర్యమునన్.
68
క.
అతగులచే ద్రుపదుఁడుబల, హితుఁ డై పట్టువడ నంతయల్పుఁడె శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా,న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్
. 69
అతగులచేన్=దుర్బలులచేత
కౌరవులందరూ వారి ప్రయత్నంలో విఫలమోతారు. ద్రుపదుడు వారందరినీ ఓడించగా పరాజయులై వెనక్కు తిరిగి వస్తారు .
వ.
ఇట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశర నిహత సురారికుమారులం బోలె వెఱచఱచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మనందనులకు నమస్కరించి మీర లింద .ుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద నని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్ర చరుండు గా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీ సముద్రంబు దఱియం జొచ్చిన. 76
ఘోరమైన యుద్ధం జరిగింది.
వ.
అట్టి మహా ద్వంద్వయుద్ధంబున విజిగీషుండయి పాంచాలుండు పాండవమధ్యము ధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన నలిగి వాసవసుతుం డుద్యతాహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుసింహంబునుం బోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాధ్వనులెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత. 87
క.
ప్రక్షీణదర్పు ద్రుపదు ర, థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు, దక్షిణ గా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్. 88
వ.
ద్రోణుండు నర్జునుచేసినపరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె. 89
క.
వీ రెవ్వరయ్య ద్రుపదమ,హారాజులె యిట్లు కృపణు లయి పట్టువడన్
వీరికి వలసెనె యహహ మ,హారాజ్యమదాంధకార మది వాసె నొకో. 90
ఆ.
ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ, యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచి పుచ్చె గురుఁడు విప్రులయలుకయుఁ, దృణాహుతాశనంబును దీర్ఘమగునె 91