Mar
20
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౩
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడుం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్ననిషాదుల ననేకశతసహస్రసంఖ్యల వారిం బాతాళవివరంబునుంబోని తన కంఠబిలంబుఁ దెఱచి యందర నొక్క పెట్ట మ్రింగిన నందొక్క విప్రుండుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుం డున్న వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడున కవ్విప్రృం డిట్లనియె.౬౩
ఉ.
విప్రుఁడ నున్నవాఁడ నపవిత్ర నిషాది మదీయభార్య కీ
ర్తిప్రియ దీనిఁబెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడున్
విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులుగారె కావునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్.౬౪
వ.
అనిన నాగరుడుని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీ సహితుండై వెలువడి వచ్చి గరుడుని దీవించి యథేచ్ఛం జనియె.౬౫
తరువాత కశ్యపుడు చెప్పినమీఁదట ఇంకా బలం కలగటానికి గరుడుడు గజకచ్ఛపాలని ఆరగించి అమృతం సాధించే నిమిత్తం స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అమృతరక్షకులను నిర్జించి అమృతాన్ని సాధిస్తాడు. అలా సాధించిన వానికి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు
సీ.
అమృతాశనంబు చేయకయును దేవ నాకజరామరత్వంబు నందుటయును
నఖిలలోకంబుల కగ్రణివైన నీ యగ్రంబునందు నిన్నధికభక్తిఁ
గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో దయచేయు ముద్ధత దైత్యభేది
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁడై యిచ్చి హరి యిట్టులనియె నాకు
ఆ.వె.
ననఘ వాహనంబ వై మహాధ్వజమ వై, యుండుమనినఁ బక్షియును బ్రసాద
మనుచు మ్రొక్కి పరచె నంత నాతనిమీఁద, వజ్రమెత్తి వైచె వాసవుండు.108
వ.
అదియును నంబరమున నగ్ని కణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబుల దాఁకవచ్చినం జూచి గరుడుండు నగి నీ చేయు వేదన నన్నుం దాఁకనోపదు నీవు మహాముని సంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపరాదు గావు మదీయైక పర్ణశకలచ్ఛేదంబు సేయుము నాయందు నీ శక్తి యింతియ యనిన సకలభూతసంఘంబులెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడిరి.౧౦౯
వ.
ఇంద్రుడు గరుడునితో స్నేహము చేసి ఆతని బలపరాక్రమములను గురించి చెప్పమంటాడు. అప్పుడు గరుడుడు అతనితో--
క.
పరనిందయు నాత్మగుణో,త్కర పరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల కైనను నీ క,చ్చెరువుగ నాకల తెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.౧౧౪
ఉ.
స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబులెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్ష సమీరణంబునన్
దేవగణేశ యీ క్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్.౧౧౫
త్రివిష్టపంబులు=మూడు లోకములు
ఇంద్రుడు గరుడునికి అతనికోరికమీద ఉరగభోజనత్వాన్ని అనుగ్రహిస్తాడు.
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడుం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్ననిషాదుల ననేకశతసహస్రసంఖ్యల వారిం బాతాళవివరంబునుంబోని తన కంఠబిలంబుఁ దెఱచి యందర నొక్క పెట్ట మ్రింగిన నందొక్క విప్రుండుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుం డున్న వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడున కవ్విప్రృం డిట్లనియె.౬౩
ఉ.
విప్రుఁడ నున్నవాఁడ నపవిత్ర నిషాది మదీయభార్య కీ
ర్తిప్రియ దీనిఁబెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడున్
విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులుగారె కావునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్.౬౪
వ.
అనిన నాగరుడుని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీ సహితుండై వెలువడి వచ్చి గరుడుని దీవించి యథేచ్ఛం జనియె.౬౫
తరువాత కశ్యపుడు చెప్పినమీఁదట ఇంకా బలం కలగటానికి గరుడుడు గజకచ్ఛపాలని ఆరగించి అమృతం సాధించే నిమిత్తం స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అమృతరక్షకులను నిర్జించి అమృతాన్ని సాధిస్తాడు. అలా సాధించిన వానికి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు
సీ.
అమృతాశనంబు చేయకయును దేవ నాకజరామరత్వంబు నందుటయును
నఖిలలోకంబుల కగ్రణివైన నీ యగ్రంబునందు నిన్నధికభక్తిఁ
గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో దయచేయు ముద్ధత దైత్యభేది
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁడై యిచ్చి హరి యిట్టులనియె నాకు
ఆ.వె.
ననఘ వాహనంబ వై మహాధ్వజమ వై, యుండుమనినఁ బక్షియును బ్రసాద
మనుచు మ్రొక్కి పరచె నంత నాతనిమీఁద, వజ్రమెత్తి వైచె వాసవుండు.108
వ.
అదియును నంబరమున నగ్ని కణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబుల దాఁకవచ్చినం జూచి గరుడుండు నగి నీ చేయు వేదన నన్నుం దాఁకనోపదు నీవు మహాముని సంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపరాదు గావు మదీయైక పర్ణశకలచ్ఛేదంబు సేయుము నాయందు నీ శక్తి యింతియ యనిన సకలభూతసంఘంబులెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడిరి.౧౦౯
వ.
ఇంద్రుడు గరుడునితో స్నేహము చేసి ఆతని బలపరాక్రమములను గురించి చెప్పమంటాడు. అప్పుడు గరుడుడు అతనితో--
క.
పరనిందయు నాత్మగుణో,త్కర పరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల కైనను నీ క,చ్చెరువుగ నాకల తెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.౧౧౪
ఉ.
స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబులెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్ష సమీరణంబునన్
దేవగణేశ యీ క్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్.౧౧౫
త్రివిష్టపంబులు=మూడు లోకములు
ఇంద్రుడు గరుడునికి అతనికోరికమీద ఉరగభోజనత్వాన్ని అనుగ్రహిస్తాడు.