Unknown
కర్ణ పర్వము-ప్రథమాశ్వాసము-1
సంజయుడు ధృతరాష్ట్రునికి కర్ణుడు తెగుటను చెప్పుట
క.
బలవిక్రమములు వినుతం, బులుగా మనమొనలుఁ బాండుపుత్రానీకం
బులు రెండునాళ్ళు పోరుట, తెలియంగాఁ జూచి వచ్చితిం గురునాథా.3

బలవిక్రమములు ప్రకటితమగునట్లుగా మన సేనలు పాండవబలంబులు రెండు రోజులపాటు జరిపిన యుద్ధాన్ని చబచి వచ్చాను రాజా.
వ. అని పలికి కర్ణునిం బ్రశంసించి.4
చ.
సరకుగొనండు పాండుసుతసైన్యనికాయము నించుకేనియున్
గరులు రథంబులున్ హరులుఁ గాల్బలముల్ తనవీఁక విచ్చియున్
మరలియుఁ దూలియుం బిలుకుమాలియు నల్గడఁ బాఱియున్ వియ
చ్చరులకు వేడ్క సేయ భుజసారము శౌర్యముఁ జూపె నేపునన్.5
వ.
చూపి యక్కౌంతేయులం గలంచి యాడి పదంపడి.6
తే.
తనకు బిమ్మిటి యైనయర్జునునిబాహు, లీల నెమ్మెయిఁ ద్రోవంగ లేక తెగియె
నధిప యాఁబోతు బెబ్బులికగ్గ మైన, పగిదియై పాండవులకును బగయడంగె.7
Unknown
ద్రోణ పర్వము
సంజయుడు యుద్ధవృత్తాంతం ధృతరాష్ట్రునికి చెప్పుట
ధృతరాష్ట్రుడు సంజయునితో--
చ.
అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ
ర్గము మఱి యెవ్వరిం గొని పరాక్రమదుర్దమపాండుపుత్ర సై
న్యమునకు మార్కొనం దలఁచె నక్కట కౌరవు లేమిచేసి రా
సమయమునన్ బలప్రచయసంఘటనం బెటులయ్యె సంజయా.

భీష్ముని తరువాత నా సైన్యము ఎవరి సారధ్యంలో ఫాండవులను ఎదుర్కొన్నది.కౌరవులు ఏమి చేసారు. అప్పుడేమి జరిగింది- అని సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడు.
Unknown
భీష్మ పర్వముప్రథమాశ్వాసము-1
ధృతరాష్ట్రునికడకు వేదవ్యాసుండు వచ్చుట
ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుడు వచ్చిఆతని అర్చనలు స్వీకరించి అతనితో --
క.
కాలం బగుటయు నృపులకు, నాలము సమకూడె దీని కడలకు మది నీ
వాలోకింపఁగ వలసిన, నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్రా.6
రాజులందరికీ కాలం మూడటం వలన ఈ యుద్ధము వచ్చింది. దీనికి బాధ పడకుము. ఈ యుద్ధం నీవు చూడదలచిన నీకు దివ్యదృష్టి నిస్తాను అనగా అతడు యుద్ధాన్ని చూడదలచలేదు, కాని దానిని గురించి వినాలని వుంది అంటాడు.
అప్పుడు వ్యాసభగవానుడు సంజయునికి యుద్ధం గురించి సర్వమూ విదితమయ్యే లాగున వరమిస్తాడు. సంజయుడు యుద్ధాన్ని మొత్తం చూచివచ్చి ధృతరాష్ట్రునికి చెపుతుంటాడు ఆ వర ప్రభావంతో.
Unknown
స్వర్గారోహణ పర్వముఏకాశ్వాసము-1
ధర్మరాజు స్వర్గలోకమున బంధుదర్శనము చేయకోరుట.
వ.
అట్లు బంధుదర్శనంబు గోరి పలికిన పాండవాగ్రజు తలంపున కనుకూలుండై యాఖండలుండు.
సీ.
తగువాని రావించి ధర్మ నందనునకుఁ దనవారిఁ జూడఁ జిత్తమునఁ గోర్కి
దనికినయది నీ వితనిఁగొని వేచని యఖిలబంధులఁ జూపు మనుడు నతఁడు
గారవం బెసఁగంగ నారాజసత్తముఁ దోడ్కొని పోవఁ గుతూహలమునఁ
దోడన నారదాదులు కొంద ఱరిగి ర ట్లేగెడు చోటఁ దట్టెదురఁ దోచె
తే.
నున్నతాసనాసీనుఁ డభ్యుదితసరసి,జాప్తసంకాశుఁ డమృతాశనాంగనాది
వృతుఁడు వీరలక్ష్మీవిరాజితుడుఁ సతత,యుక్తాసుఖసాధనుండు దుర్యోధనుండు.3
Unknown
మహాప్రస్థానీక పర్వము-ఏకాశ్వాసము-1
పాండవులు మహాప్రస్థానీక గతు లగుట
సీ.
అర్జునుం డమ్మెయి నచ్యుతరామాదియాదవజనులవృత్తాంతములును
దనదు తెఱంగు సత్యవతీతనూభవుహితభాషణంబులు నేర్పడంగఁ
జెప్పిన విని యుధిష్టరుండు ప్రస్థానంబునకు మది యొలయ నన్నరునితోడ
నఖిలభూతంబుల ననఘ పాకంబుఁ బొందించుఁ గాలుండు మదీయబుద్ధి
తే.
కర్మ సంత్యాగకలనంబు కార్య మిప్పు
డనువినిశ్చయ మొందె నీమనము నరయ
నిదియ మేలుగఁ గనుచున్కి విదితమయ్యె
నాకు ననవుడు నయ్యింద్ర నందనుండు.4
Unknown
మౌసల పర్వము-ఏకాశ్వాసము-1
ధర్మజు రాజ్యంబున నుత్పాతంబులు తోఁచుట

సీ.
భారతసంగ్రామపారీణుఁడై జయరమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ బాండవముఖ్యునిఁ బట్టంబు కట్టినయది ,యాది కాఁగ ముప్పదియు నైదు సంవత్సరంబులు చన ననంతరవత్సరంబునఁ బ్రజకు భయం బొనర్చు నుత్పాతములు పుట్టె నుర్వీశ విను మహావాయువు శర్కరావర్షి యగుచు
ఆ.
వీచు నర్కు నుదయవేళల బింబంబు, బలసి తోఁచు ఘనకబంధసమితి నీరదములు లేక నిర్ఘాతపాతముల్, కలుగు నుల్క లెల్లకడల డుల్లు.3

భారతసంగ్రామానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడైన ముప్పది ఐదు సంనత్సరములు చనిన పిమ్మట తరువాతి సంవత్సరంలో ప్రజలకు భయం కలిగించే అనేక ఉత్పాతములు పుట్టినవి. గులకరాళ్ళవర్షం, సూర్యుని ఉదయాస్తమయ సమయాల్లో బింబము మరీ పెద్దదిగాను, మబ్బునీరు మొత్తము మేఘములు లేకుండగనే పెద్ద వర్షంగా ఆపులేకుండా కురియటం, ఉల్కాపాతములు మొదలగునవి కలిగేవి.
సీ.
యిట్లనుదినమును నెన్నియేనియును మహోత్పాతములు పుట్టుచుండఁ గొంత కాలంబు పోవఁగఁ గౌంతేయముఖ్యుండు వినియె నొండొరులతోఁ బెనఁగి సర్వ యాదవులును దెగి రంభుజనాభుండు హలధరుండు దక్క నని నరేంద్ర విని భీమసేనుని వివ్వచ్చు నకులుని సహదేవు రావించి సంభృతార్తి
తే.
యగుచు నవ్వార్త యెఱింగించె నందఱకును, వారలేవురు నెవ్వగల్ కూరుమాన
సములు కలఁగ నత్యంతవిషణ్ణు లైరి, సకలజనకోటులును శోకజలధి మునుఁగ.
5
Unknown
ఆశ్రమవాస పర్వము-ప్రథమాశ్వాసము-1
సుమారు ౧౫ సంవత్సరములు గడచిన పిమ్మట ఒకనాడు--
ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దన మనోరథంబు తెలుపుట
సీ.
కార్య మైనను నెవ్వఁడేనియుఁ జేయఁ దొడఁగునప్పుడు విను పుడమి ఱేని
చే ననుజ్ఞాతుఁడై కాని తొడంగఁ గా దట్లు కావున వార్ధకాభిలీఢ
మైన మదీయకాయమునకు సంస్కార మాచరింపఁగఁ దపమాచరించు
పనికి భూపాల నీయనుమతి పడయంగ వలసి చెప్పెద రాజవంశజునకు
ఆ.
సమరమరణ మొండె విమలతపమునకుఁ, జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె
వలయు నస్మదీయకులముఖ్యు లిట్టుల, నడపి రనుపు నన్ను నడవి కనఘ.27

ఎవరైనా ఏపనైనా చేయాలనుకున్నపుడు రాజానుమతితో కాని ఇంకో విధంగా చేయకూడదు.
కాన ముసలితనముచే పూర్తిగా తినబడిన నా శరీరాన్ని సంస్కారించుకొనే నిమిత్తం తపస్సు
చేసుకోవడానికి నీ అనుజ్ఞ కావలసి చెపుతున్నాను విను. రాజవంశంలో పుట్టినవానికి
యుద్ధంలో గాని, తపస్సు ద్వారా కాని చావాల్సి వుంది. నా కులం లోని
కులముఖ్యులందరూ ఇలానే చేసారు. అందుచేత నన్ను అడవికి పంపించు.
క.
రాజు గురుఁ డెల్లవారికి, రాజోత్తమ గురునియాజ్ఞ రంజిల్లఁగఁ బే
రోజం జేసినకృత్యము, సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్.28

రాజు ఎల్లవారికి గురుడు.రాజోత్తమా గురునియాజ్ఞ రంజిల్లునట్లుగా పేరోజం(?)
చేసిన కార్యమే రెండు లోకాల్లోనూ శోభను కూర్చుతుంది.
అనగా ధర్మరాజు మొదట్లో ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడు తాము తపస్సుకు వెళ్ళటానికి
ఒప్పుకోకపోతే అన్నం తిననంటాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చి
ధృతరాష్ట్రాదులకు అనుమతిని ఇమ్మని ధర్మరాజుకు సూచిస్తాడు.
దానికి ధర్మరాజు ఒప్పుకోవటం జరుగుతుంది.