Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౩
కథా ప్రారంభము.
వ.
జనమేజయుండు వైశంపాయునున కిట్లనియె.౪౩
చ.
మహితసముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనా
సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై
నహితుల క ప్రమేభేద్యముగ నాపదుమూఁడగు నేఁడు మత్పితా
మహులు చరించి రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా.౪౪
నిగూఢవృత్తిమై=రహస్యమైన వ్యాపారము
ధౌమ్యుడు పాండవుల నూరార్చుట
ఉ.
ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయవృత్తి స
త్కర్మవిధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వై నయట్టినీ
పేర్మికి నీడె దుర్దశలపెల్లునకున్ దురపిల్లు టారయన్.౫౧
పేర్మికిన్=గొప్పదనమునకు
వ. అట్లుంగాక.52
క.
దేవతల కైన నొక్కొక,చో వలయున కాదె శత్రుసూదనవిధికా
లావాప్తికి మును దమస,ద్భావము లడఁచికొనియడఁగఁ బడి యుండగన్.౫౩
సీ.
నిషధాత్రి యం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును
నదితిగర్భంబున నవతార మై వామనాకారమున హరి యడఁగుటయును
జనని యూరుప్రదేశంబున నతినిగూఢంబుగా నౌర్వుండు డాఁగుటయును
ధేనుశరీరవిలీనుఁ డై యజ్ఞాతచర్య మార్తాండుండు సలుపుటయును
ఆ.వె.
వినమె యిట్లు వడినవీరలు పదపడి, తమకు నగ్గ మైన తఱి జయింప
రెట్లు ప్రబలి రిపుల నీవును నాపద, కోర్చి భంగపాటు దీర్చికొనుము.౫౪
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౧౦
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
ఆ.వె.
దారసంగ్రహంబు ధరణీశ రతిపుత్ర, ఫలము శీలవృత్త ఫలము శ్రుతము
దత్తభుక్త ఫలము ధనము వేదము లగ్ని,హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు
.౫౨

పెళ్ళికి రతి సుఖము, పుత్రులు కలుగుట ఫలము. శ్రుతులను వినటం వలన ఫలితం మంచి నడవడికను పొందటం. ఢబ్బుకు దానము, భోగము ఫలము. వేదమునకు ఫలం అగ్నిహోత్రం. అని తెలుసుకో.
చ.
బహుధనధాన్యసంగ్రహంబు బాణశరాసన యోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘసం

గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా

వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లై న దుర్గముల్.
౫౩
దుర్గ రక్షణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు.
బహు ధన ధాన్య సంగ్రహం ఐ వుండాలి. బాణాలను శరములను ప్రయోగించగల వీరులతో వుండాలి.నిరంతరాయంగా మంచినీరు, తృణజలకాష్ఠసమూహంతో కూడి వుండాలి.అనేక యంత్రములు కలిగి శత్రువులకు భేధించరానిదై వుండాలి.
ద్విషద్భయా వహులు=?. నీచే రక్షించబడే కోట పై విధంగా వుందా? అని అడుగుతున్నాడు నారదుడు.
చ.
వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ

విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు

ర్మదమలినాంధ చిత్తులఁ
బ్రమత్తులఁ నింద్రియనిర్జితాత్ములన్.౫౪

మంచి బుద్ధితో నీలోపలనున్న శత్రువర్గాన్ని వదలకుండా జితేంద్రియుడ వై మొదలనే దేశకాలబలములు ఇంకా దైవబలమూ కూడా కల్గి శత్రువులను ఓడించడానికి ఉత్సాహముతో నున్నావా.ఇంద్రియాలను వశపరచుకొనే వానిని జాగరూకుడవై కనిపెట్టుకుని వుంటున్నావా.
తే.
కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న, నీకు ముందఱఁజని రిపునృపులయందు దగిలి సామాద్యుపాయంబులొగినసంప్ర,యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.౫౪

నీవు యుద్ధానికి వెళ్ళేప్పుడు నీకంటే ముందుగా వెళ్ళి శతృవులలో చేరి సామాద్యుపాయములతో నీ విజయానికి సహాయకారిగా చేసుకొంటున్నావా చెప్పు.
వ.
మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం లనర్థజ్జ్ఞులతోడిచింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబులయం దనర్థకచింత నిశ్చితకార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబుల బ్రయోగింపమి విషయంబులం దగులుట యనం బరగిన పదునాలుగు రాజదోషంబుల పరిహరించితె యని నారదుడు ధర్మరాజును అడుగుతాడు.౫౬
రాజైనవాడు పరిహరించాల్సిన పద్నాలుగు దోషాలను తెలియజేస్తాడిక్కడ.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-
వ.
"కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం, కికాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే." యని నీవు తొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుండగు హరిహరనాధుండు నీ దెస దయాళుం డై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోకనివాసియయిన నాకుఁ దనదివ్యచిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టిశక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయం చేయుచున్నవాఁ డనుచుం జూపుటయు సవిశేషసంభ్రమసంభరితహృదయుండ నయి గలయం గనుంగొను నప్పుడు.౧౧
పరిష్క్రియాయాం=అలంకారము నందు
అవధరించి=చిత్తగించి
సీ.
కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున శశిరెఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందనమున్న గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱి యైన చెలువున నెఱసినలోకరక్షణ మన గరళంబుచాయ దోఁప
బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబంబు నా నురమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే.
సురనదియును గాళిందియు బెరసినట్టి, కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముగఁ జేయ, నెలమి సన్నిధి సేసే సర్వేశ్వరుండు.౧౨
హరినీలపాత్రిక=ఇంద్రనీలమణుల పాత్ర, గుఱి=గురుతు
క.
పారాశర్యుని కృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద,ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్.౧౭
పారాశర్యుడు=వేదవ్యాసుడు
ఆరాధ్యము=పూజింపఁదగినది
తే.
తెనుఁగు బాస వినిర్మింపఁ దివురుటరయ, భవ్యపురుషార్థతరుపక్వ ఫలముగాదె
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిప,తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ.౧౮
ఎడ=హృదయము
ఉ.
ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
త్యంతవిభూతిఁ బెం పెసఁగునట్టినినుం గొనియాడ జేత దా
నెంతటిపెద్ద నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.౨౧
చేఁత=చేయుట
ఉ.
ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారతసంహితఁ జెప్పఁ గంటి నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.౨౭
పుట్టు=జన్మము, భారతసంహిత=భారతమను నితిహాసము
ఉ.
కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్ జనా
భ్యర్చిత మైన భారత మపారకృపాపరతంంత్రవృత్తిమైఁ
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా
నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్.౨౮
వరణీయుఁడ=కోరదగినవాడను
ఉ.
కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావలి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదం బయిన చిత్తము తోడ మహాకవిత్వదీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్.౩౦
గర్ణపుటంబుల=చెవులను దొప్పలచేత
సాత్యవతేయసంస్మృతి శ్రీవిభవాస్పదంబు=వ్యాసుని స్మరణము అను సంపదయొక్క మహిమకు చోటు
అని విన్నపం చేసుకొని తిక్కన గారు భారత రచన కుపక్రమించారు.













Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౪
ధర్మరాజు ధౌమ్యునితో నిట్లనియె.
తే.
వనమునకు వచ్చి నవయంగ వల దుడుగుఁ, డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్ వీరికాహార మేయు,పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు.౩౬
వ.
వీరల విడువనోప నేమిసేయుదు ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరాజున కి ట్లనియె.౩౭
ఆ.వె.
భూత రాశి తొల్లి పుట్టి బుభుక్షాభి,తప్త యినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి , కమలభాంధవుండు కరుణ తోడ.౩౮
కమలబాంధవుండు=సూర్యుఁడు
వ.
ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి దక్షిణాయనగతిం బర్జన్యభూతుం డై యోషధులం బడసి రాత్రులయందుఁ జంద్రకిరణాంమృతంబునంజేసి వానిం దడుపుచు వర్ధించి యం దన్నంబు పుట్టించి ప్రజాప్రాణాధారణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహుషాదులు యోగసమాధిష్టితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల వలనం బ్రజలం సముద్ధించిరి గావున.౩౯
లయగ్రాహి.
వారిరుహమిత్రు నమరోరగమునిద్యుచరచారణగణ ప్రణుత చారుగుణు భూతా
ధారు నఖిల శ్రుతిశరీరు హరిశంకరసరోరుహభవప్రతిము దారుణతమిస్రా
వారణమరీచి పరిపూరిత దిగంతరు నఘారి నతికారుణికు సూర్యుఁ ద్రి జగ ద్ర
క్షారతుసహస్రకరుఁ గోరిభజియింపుము మనోరథఫలంబు లగు భూరిభుజనీకున్.౪౦
అని ధౌమ్యుడు ధర్మరాజునకు సూర్యుణ్ణి ఆరాఢించమని చెప్పగా ధర్మరాజావిధంగా చేసి సూర్యునివలన ఒక అక్షయపాత్రను పొంది దానిద్వారా ఆ ౧౨ సంవత్సరములు అతిథిలకు ఆహారాన్ని సమకూద్చుకుంటారు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౪
మత్స్యగంధి వృత్తాంతము, శ్రీ వేదవ్యాస మునీంద్రుని అవతారము
సీ.
చపలాక్షి చూపులచాడ్పున కెద మెచ్చుఁ జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీఁగయందంబు మది నిల్పు జఘనతలంబుపైఁ జరుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు వేడ్కతో మఱుమాట వినఁగఁదివురు
నతి ఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
ఆ.వె.
నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు, లయ్యుఁగడువివిక్త మయిన చోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ, గాముశక్తి నోర్వఁగలరె జనులు.౩౮
పరాశర మహర్షి ఒకసారి మత్స్యకన్య యైన సత్యవతి యేకవస్త్రయై ఓడనడుపుతూ ఉన్నపుడు ఆమె జన్మరహస్యం
దివ్యదృష్ఠితో నెఱిఁగిన వాడై ఆమెయందు మదనపరవశుడయ్యి ఆమె ఓడ నెక్కి ఆ విధంగా ప్రవర్తించాడట.
ఉ.
సంచితపుణ్యుఁ డంబురుహ సంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారత సంహితఁ జేసె నున్నతిన్.౪౭
సత్యవతి యందు పరాశరమునికి సద్యోగర్భంబున వేదవ్యాస మహర్షి జన్మిస్తాడు. ఆ వేదవ్యాసుడే వేదవాజ్ఞ్మయాన్ని విభాగించి లోకములలో వ్యాప్తి నొందించి సమస్తలోకాలకు హితవు గూర్చేట్లుగా పంచమ వేదమైన భారత సంహితను నిర్మిస్తాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౯
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
వలయు నమాత్యులుఁ జుట్టం,బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం
సులు బలసి యుండ నిచ్చలుఁ, గోలువుండుదె లోకమెల్లఁ గొనియాడంగన్.౪౮
క.
పరికించుచు బాహ్యాభ్యం,తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్.౪౯
బయటను లోనను ఉన్న జనుల వలన ఎల్లప్పుడూ జాగరూకుడవై నీ రక్షణను చూసుకుంటూ ఇతర రాజుల కదలికల్ని నేర్పరులైన చారులనెడు కన్నులతో గమనిస్తున్నావు గదా.
క.
వెలయఁగ విద్వజ్జనము,ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార,మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.౫౦
ఆ.వె.
వార్తయందు జగము వర్తిల్లు చున్నది, యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింప వలయుఁ బతికి.
వార్త=అర్థానర్థవివేచన విద్య
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౩
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౮
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కృత మెఱిఁగి కర్త నుత్తమ, మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు, పతియె జగజ్జనులనెల్లఁ బరిపాలించున్.౪౬

చేయదగినది తెలిసికొని కర్తను సభలలో బాగుగా పొగడి మర్చిపోకుండా తగిన సత్కారమును చేస్తున్నావు గదా. చేయదగినదానిని తెలుసుకున్న రాజే జగాలనన్నీ పరిపాలించగలుగుతాడు.
సీ.
ఆయంబునందు నాలవభాగమొండె మూఁడవభాగమొండె నం దర్థమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవనినాథ యాయుధాగారధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందుఁ బరమవిశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య
ఆ.
గురుల వృద్ధశిల్పివరవణిగ్బాంధవ, జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదరికము వొరయకుండఁగఁ బ్రోతె, సకలజనులు నిన్ను సంస్తుతింప.౪౭
ఆదాయంలో నాల్గవభాగం ఆయుధాగార ధనాగారముల నిర్వహణకు, మూడవభాగాన్ని సైన్యాన్నిఅశ్వదళ నిర్వహణకు,
ఒకటిన్నర భాగాన్ని గజసైన్యనిర్వహణయందు ఖర్చుపెట్టాలి కాని అంతకు మించి ఖర్చు పెట్టరాదనే విషయం గ్రహించావు గదా. ధనాగార నిర్వహణలో దక్షులను భక్తులను పరమ విశ్వాసం గలవారినే నియమించుకొన్నావుగదా.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౨
శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట
తే.
జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు, లామిషం బెట్లు భక్షించునట్లుదివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల, ననుదినంబును భక్షింతు రర్థవంతు.౨౭

నీటిలో చేపలు, ఆకాసములో పక్షులు మాంసాన్ని తినేటట్లుగా అందరూ చేరి డబ్బుకలవాణ్ణి ఎల్లప్పుడూ తింటూ ఉంటారు.
క.
అర్ధమ యనర్థమూలం, బర్థమ మాయావిమోహనావహము నరుం
డర్ఠార్జనదుఃఖమున న, పార్థీ కృత జన్ము డగుట పరమార్థ మిలన్.౨౮
అపార్థీకృతజన్ముడు=నిరర్థకమగు జన్మ కలవాడు

ధనము అనర్థాలకి మూలం. ధనము మాయావి , మోహాన్ని కలిగించేది. నరుడు ధనసంపాదనార్థం కలిగే దుఃఖం వల్ల నిరర్ధకమైన జన్మ కలవాడగుచున్నాడు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౩
ఉపరిచర వసు మహారాజు వృత్తాంతము
వ.
అట్టి యింద్రోత్సవంబున నతి ప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రధ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱు వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుడయి రాజర్షియయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపంబున బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతియై గిరినిరోధంబుంబాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నింగాఁ జేకొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టుమని తనపితృదేవతలు పంచిన నప్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.౨౬
భారతం లోని ఈభాగాన్ని ఆధారంగా చేసుకుని వసుచరిత్ర కావ్యం రామరాజభూషణునిచే వ్రాయబడిందని చెప్తారు.
సీ.
పలుకులముద్దును గలికి క్రాల్గన్నుల తెలుపును వలుదచన్నుల బెడంగు
నలఘు కాంచీపదస్థలములయొప్పును లలితాననేందు మండలము రుచియు
నళినీల కుటిల కుంతలముల కాంతియు నెల జవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలపును గలుగు నగ్గిరికన తలఁచి తలఁచి
ఆ.వె.
ముదితయందుఁ దనదుహృదయంబు నిలుపుటఁ, జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద,మయ్యె నవనిపతికి నెయ్యమొనర.౨౭
రేతఃస్యందము=ఇంద్రియము పడుట
ఈ రేతస్సునుండి అద్రిక అనే అప్సరస ద్వారా మత్స్యరాజు,మత్స్యగంధి అనే ఇద్దరు పుట్టడం జరుగుతుంది.

Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౭
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
చోరభయవర్జితముగా, ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవధ్భృత్యవరుల్.౪౨

దొంగలవలని భయం లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నావా? నీ భృత్యులు చోరులనుండి ధనాన్ని గ్రహించి వారిని రక్షించటం లేదుగదా!
క.
ధరణీనాధ భవద్భుజ, పరిపాలిత యైన వసుధఁ బరిపూర్ణము లై
కర మొప్పుచున్నె చెఱువులు, ధరణి కవగ్రహభయంబు దనుకకయుండన్.౪౩
అవగ్రహ=వానలేమివలని
తనుకక
=కలుగక
రాజా! నీరాజ్యంలో చెఱువులన్నీ నీటితో నిండి ఉన్నాయా! వానలేమి భయం లేకుండా అంతా సుభిక్షంగా ఉన్నారుగదా.
చూడండి చెఱువుల ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ఎన్నో ఎన్నెన్నో చెఱువులు కబ్జా అయిపోయి , లేక పూడిపోయి ఉండి వ్యవసాయానికేమాత్రం ఉపయోగపడకుండా ఉంటున్నాయి.
క.
హీను లగు కర్షకులకును, భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న,నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.౪౪

పేదవారైన రైతులకు ధాన్యాన్ని,విత్తనాల్ని అలాగే వర్తకులకు అనూనముగా ఉత్తమ బుద్ధితో ఋణములను ఇస్తున్నావు కదా.
క.
పంగుల మూకాంధుల విక,లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁదశత్రునైనను, సంగరరంగమునఁ గాతె శరణంబనినన్.౪౫

కుంటి,మూగ,అంధ వికలాంగులను, బంధువులెవ్వరూ లేనివారిని దయతో బ్రోచుచున్నావు గదా ! ఆపద కలిగించిన శత్రువునైనా సరే శరణు వేడితే రక్షిస్తున్నావుగదా!
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౨
పాండవ ధార్తరాష్ట్రుల భేదకారణ సంగ్రహము
సీ.
వదలక కురుపతి వారణావతమున లక్కయిల్ గావించి యక్కజముగ
నందఱఁజొన్పి యం దనలంబు దరికొల్పఁ బనిచిన బాండునందను లెఱింగి
విదురోపదిష్ట భూవివరంబునం దపక్రాంతులై బ్రదికి నిశ్చింతులైరి
ధర్మువు నుచితంబుఁ దప్పని వారల సదమలాచారుల నుదితసత్య
ఆ.వె.
రతుల నఖిలలోకహిత మహారంభుల, భూరిగుణుల నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు, దురితవిధుల నెపుడుఁ బొరయ కుండ
.౧౪
పాండవులు ఎలాంటివారో వారిని దైవం ఎందులకు కాపాడుతుందో పై పద్యం చివరి మూడు పాదాలలోను వ్యాస మహర్షి వివరించటం జరిగింది.
శా.
నారాయణ పాండవేయగుణమాహాత్మ్యామల జ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్ జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై సాత్యవతేయ ధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాక్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంత విధ్వంసి యై.౨౧
ధీవనధి=బుద్ధియనెడి సముద్రమునుండి
అమృతసూతి=చంద్రుడు
అఘధ్వాంత=పాపమనెడి చీఁకటి
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-1
భారత మహిమము

వ.
ఆ వైశంపాయనుండును నఖిలలోకవంద్యుండయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారముసేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.

సీ.
కమనీయధర్మార్ధ కామమోక్షములకు నత్యంత సాధనంబయిన దాని
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్న వారల కభిమత శుభకరం బయిన దాని
రాజులకఖిల భూరాజ్యాభివృద్ధినిత్యాభ్యుదయ ప్రదం బయిన దాని
వాఙ్మనఃకాయప్రవర్తితానేక జన్మాఘనిబర్హణం బయిన దాని
ఆ.వె.
సత్యవాక్ప్రబంధ శత సహస్రశ్లోక, సంఖ్య మయిన దాని సర్వలోక
పూజ్య మయినదాని బుధనుత వ్యాస మ,హాముని ప్రణీత మయినదాని.౯
తవిలి= ఆసక్తి కలిగి
అఘనివర్తకంబు=పాపనివర్తకము

ధర్మార్థ కామమోక్షాలకి సాధనం, వినేవారికి శుభాల్నిచ్చేది, రాజులకు భూరాజ్యాభివృద్ధినిచ్చేది, వాక్ మనఃక్కాయములచే చేయబడిన అనేక పాపాల్ని నివర్తింప జేయగలిగేది, లక్షశ్లోకాత్మకమైనది, సకల లోకాలలో పూజింపబడేది, వ్యాస ప్రణీతమయినదీ ఈ మహాభారతము.
శా.
ఆయుష్యం బితిహాస వస్తు సముదాయం బై హికాముష్మిక
శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంత గృహంబు నాఁ బరఁగి నానావేద వేదాంత వి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భార తాఖ్యానమున్.౧౧
ఇతిహాసము=పూర్వకథలనెడి
ఆఖ్యానమున్=కథను
ఆయుస్సును పెంపొందించగలిగేది, పూర్వకథల సముదాయంతో కూడి ఐహికాముష్మిక శ్రేయాల్ని కలుగజేయటానికి కారణమైనది, ఉత్తమ సభా సేవ్యమయినది, ఆగమశాస్త్రాలకు గృహము వంటిదిగా ప్రసిద్ధినొంది - అన్ని వేదవేదాంతవిద్యల కాటపట్టయినట్టి మహాభారత కథను చెప్పడం మొదలుపెట్టాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౬
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కులపుత్ర్రులైనసద్భృ, త్యులకును సత్కార మర్ధితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని,మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతురనిన్.
౩౯

మంచి వంశములో పుట్టిన మంచి సేవకులకు కోరికతో సత్కారాలు చేస్తున్నావా? వారు నీ విషయంలో చేయదగువిషయాన్ని బాగుగా తలచి యుద్ధంలో ప్రాణాల్నిసైతం విడిచి పెడతారు.
క.
అనఘా నీ ప్రస్తనమున, నని నీల్గిన వీరభటులపోష్యుల నె
ల్లను బ్రోతె భోద నాచ్ఛా,దనముల వారలకు నెమ్మి తఱుఁగక యుండన్.
౪౦

నీ కారణంగా యుద్ధములో చనిపోయిన వీరభటుల మీద ఆధారపడినవారి నందరికి వారి వారి తిండీ గుడ్డా వగైరాలకి లోటు రాకుండా వారి క్షేమమును సరిగా చూసుకుంటున్నావుగదా.
క.
ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ,ర్పనివారలఁ బగఱవలనివారల ధృతి చా
లనివారల దుర్జనులం, బనుపవుగా రాచకార్యభారము దాల్పన్
.౪౧
రాచకార్యాలందు నియోగించ దగని వారి గురించి చెపుతున్నాడు.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౭
ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట
తక్షకుని విషాగ్నికి తన హర్మ్యంబుతో సహితముగ పరీక్షన్మహారాజు దగ్ధుడవుతాడు. తరువాత జనమేజయుడు ఉదంకునితో ప్రేరేపింపబడినవాడై సర్పయాగమున తక్షకాది కాకోదర సంహతిని అగ్నిలో పడి నాశనమయ్యేట్లుగా చేయదలచి పురోహితులను ఋత్విజులను పిలిచి వారితో ఇలా అంటాడు.
చ.
తన విషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్ర బాంధవజనుం డగు తక్షకు నుగ్ర హవ్యవా

హన శిఖిలన్ దహించి దివిజాధిపలోక నివాసుఁ డైన మ

జ్జనకున కీ యుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్.
౨౦౬

ఈవిధంగా యజ్ఞం ప్రారంభం అవుతున్నపుడు ఓ వాస్తుశాస్త్ర ప్రవీణుడు ఇది కడచననేరదని జోస్యంచెపుతాడు.
అయినా సరే అని యజ్ఞం ప్రారంభిస్తారు. తక్షకుడు ఇంద్రుని రక్షించమని వేడుకొంటాడు. వాసుకి చెల్లెలయిన జరత్కారువుని తన కొడుకు ఆస్తీకుని పంపించి ఆ యజ్ఞాన్ని ఆపుచేయించవలసినదని వాసుకి ప్రభృతులు కోరతారు. అప్పుడు తల్లి యనుజ్ఞనొంది ఆస్తీకుడు జనమేజయుని యాగశాల చేరుకుని జనమేజయుడిని ఆతని యజ్ఞాన్ని ఈ విధంగా స్తుతిస్తాడు.
మ.
రజనీనాథకులై క భూషణుఁడవై రాజర్షి వై ధారుణీ
ప్రజ నెల్లన్ దయతోడ ధర్మ చరితం బాలించుచుం దొంటి ధ

ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్

విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షతా
.౨౨౪
రజనీనాథ=చంద్ర
పారీక్షతా=పరీక్షత్పుత్రా
తరలము.
కువలయంబున వారికోరినకోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో

నవని రాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం

దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తు లైరి మహా ద్విజుల్
.౨౨౫
ఉ.
అమ్మనుజేంద్రుఁ డైన నలుయజ్ఞము ధర్మజురాజసూయయ
జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతి యజ్ఞముఁ బాశపాణి య

జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ య

జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా
.౨౨౬
చ.
వితతమఖప్రయోగ విధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుత సుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ

క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్సతి

క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వ విద్యలన్.
౨౨౭
విధివిత్తములు=కార్యము నెఱిఁగినవారు
పూర్వదిక్సతి=ఇంద్ర
శా.
విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృ
ష్ణద్వైపాయనుఁ డే గుదెంచి సుతశిష్యబ్రహ్మసంఘంబుతో

సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా

క్షాద్విష్ణుండవ నీవు భూపతులలోఁ గౌరవ్య వంశోత్తమా
.౨౨౮
ఉ.
ఆర్తిహర క్రియాభిరతుఁ డై కృతసన్నిధి యై ప్రదక్షిణా
వర్తశిఖాగ్ర హస్తముల వహ్ని మహాద్విజ దివ్యమంత్ర ని

ర్వర్తిత హవ్యముల్ గొనుచు వారిజ వైరికులేశ నీకు సం

పూర్తమనోరథంబులును
బుణ్యఫలంబులు నిచ్చు చుండెడున్.
ఆర్తిహర=దుఃఖమును దొలఁగించు
వారిజ వైరి=చంద్ర
(ఎవరినైనా మెప్పించి వారినుండి ఏ కోరికనైనా తీర్చుకోవాలంటే ఎలా మాట్లాడాలో ఇంతకంటె ఎక్కడా బాగా చెప్పుండరు)
వ.
అని జనమేజయుండు నాతనియజ్ఞ మహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతులయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.౨౩౦
ఉ.
మానిత సత్యవాక్య యభిమన్యు కులోద్భవ శాంతమన్యుసం
తానుఁడ వై దయాభి నిరతస్థితి నీవు మదీయబంధుసం

తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో

ర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్
.౨౩౧
శాంతమన్యుసంతానుఁడు =శాంతించిన కోప సమూహము గలఁవాడు
ఉపరతంబు=ఉడుగు
వ.
అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె.౨౩౩
క.
ఒనర జరత్కారమునీం,ద్రునకు జరత్కారునకు సుతుం డైనమహా
మునివరు నాస్తీకుని ముద,మునఁదలఁచిన నురగభయముఁ బొందదు జనులన్.
౨౩౭
ఆది పర్వము - ద్వితీయాశ్వాసము సమాప్తం.



Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-6
క.
క్రోధమ తపముం జెఱచును, గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు, బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే
౧౭౪

క.
క్షమ లేని తపసితనమును, బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురా
జ్యము భిన్న కుంభమున తో, యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.
౧౭౫


పరీక్షితుడు అడవికి వేటకెళ్ళి అక్కడ శమీకు డనే మునీశ్వరుని- తను వేటాడుతున్న జంతువు గురించి వివరం అడిగి-, మౌనవ్రతుడైన ముని సమాధానం చెప్పక పోతే- అతని మెడలో చచ్చిన పాము శవాన్ని వేసి వస్తాడు. శమీకుని పుత్రుడు శృంగి ఇది తెలిసి పరీక్షితుడు ఏడు రోజులలో తక్షక విషాగ్ని వలన చనిపోతాడని శాపం ఇస్తాడు. శృంగి తరువాత తండ్రికి ఈ విషయం చెప్పగా శమీకుడు శోకించి కొడుకుతో పై విధంగా అంటాడు.
వ.
క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధంబైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్ట సేసితివి. రాజ రక్షకులై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు వేదవిహితధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు సేయునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజ సామాన్యుంగా వగచితే.౧౭౬
వగచితే=తలఁచితివా?
ఉ.
క్షత్రియవంశ్యు లై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగు జాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామ మాం
ధాతృ రఘుక్షి తీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.౧౭౭ (పోలిక కొంచెం ఎక్కువయిందని పిస్తుంది)
వ.
అతండు మృగయా వ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుడయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీ యిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని ల గ్గగు ననిన శృంగి యిట్లనియె.౧౭౮
నేర్తేని=సాధ్యమయితేని
క.
అలుక మెయిమున్న పలికితి, నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ, దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.౧౭౯
తలరఁగన్=చలించునట్లుగ
వ.
నావచనం బమోఘం బనిన శమీకుండు శోకాకలితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీనినంతయుఁ బరీక్షితున కెఱిగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని అన్ని విషయాలు తెలియజేస్తాడు--౧౮౦
తరువాత ఇక్కడో చిన్న కథ కూడా వుంది.
కశ్యపు డనే వైద్యుడొకడు తక్షక విషాగ్నిచే చనిపోయే పరీక్షితుని బ్రతికించి రాజు నుండి విశేషమైన ధనాన్ని పొందగోరి వెళ్తుంటాడు. ఇది తెలిసిన తక్షకుడు అతని కెదురుపడి అతన్నడిగి విషయం తెలుసుకొని నీకిది సాధ్యం గాదని సవాలు చేసి చేతనైతే- అక్కడ వున్న ఓ మహా వృక్షాన్ని కాటువేసి తన విషంతో బూడిదగా మార్చి- దానిని ముందటిలా తన వైద్యంతో పునర్జీవింప చేయమంటాడు. అతడు దానిని తన శక్తితో ముందటిలా పునర్జీవింప జేస్తాడు. అప్పుడు తక్షకుడే అతనికి విశేషమైన ధనాన్ని ఇచ్చి మరలింప చేస్తాడు. కొసలో చిన్నగమ్మత్తేంటంటే నిర్జనమైన అడవిలో జరిగిన ఈ విషయం బైట లోకానికెలా తెలిసిందన్నది. అక్కడ ఆ చెట్టుపైకి పుల్లలకోసం ఎక్కిన వాడొకడు చెట్టుతో పాటే దగ్ధమై మళ్ళీ చెట్టుతో పాటే పునర్జీవితుడైన వాడొకడు దీనిని ప్రజలకు చెప్పటం జరిగిందట. అదీ సంగతి.మన పూర్వీకుల్లో ఎంతెంత గొప్పవాళ్ళున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౪
గరుడుడు అమృతాన్నితెచ్చి ఉరగులకిచ్చి తను, తన తల్లి పంచభూతముల సాక్షిగా దాస్యమునుంచి విముక్తి పొందామని చెప్పివారిని శుచిగా స్నానం గట్రా చేసి వచ్చి ఆరగించమని చెప్పి శుభ్రమైన ప్రదేశంలో దర్భలపై అమృతం కలిగిన పాత్రను ఉంచి అక్కడినుంచి తల్లితో సహా వెళ్ళిపోతాడు. వారు శుద్ధులై వచ్చేలోగానే అదృశ్యరూపంలో గరుడుని వెనకాలే వచ్చిన ఇంద్రుడు ఆ పాత్రనక్కడినుండి తీసుకుని స్వర్గానికెళ్ళిపోతాడు.
వ.
అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటం జేసి నాఁటంగోలె ద్విజిహ్వులు నాఁ బరగిరి యమృతస్థితిం జేసి బర్భలు పవిత్రంబు లయ్యె.౧౨౩


తరువాత శేషుడు తన వారు చెసిన పనికి విచారించి వారిని విడిచిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేసి భూభారాన్ని ధరించేలా వరాన్ని పొందుతాడు.తల్లి శాపం వల్ల జనమేజయ సర్పయాగంలో ఉరగులకు గల మరణాన్నించి వాసుకి చెల్లెలైన జరత్కారువునకు జరత్కారుడనే మునీశ్వరునికి పుట్టే ఆస్తీకుడనేవాని వలన రక్షణ కలుగుతుందని బ్రహ్మ చెప్పాడట.
జరత్కారుని చరిత్రము
జరత్కారుడు వివాహానికి విముఖుడై వుంటే ఆతని పూర్వీకులు అతడు సంతానం లేకుండా వుండటం వలన వారికి సద్గతులు కలగటం లేదంటారు. అది తెలిసినవాడై పెళ్లి చేసుకోడానికి సిద్ధపడి తన పేరు వంటి పేరుగల సనామ్నినే చేసుకుంటానంటాడు. అప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు అనే ఆమెతో అతని వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన ఆస్తీకుడే జనమజేయుని సర్పయాగాన్ని విరమింప జేసి సర్పములను రక్షిస్తాడు. ఆ సందర్భంలోని అపుత్రకులకు గతులు కలుగవని చెప్పే పద్యం ఇది.
చ.
తగినసుపుత్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడుఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడఁగఁ జేసియుం బడయ నేర రపుత్రకు లైనదుర్మతుల్.౧౫౦
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-5
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట.
క.
ఉపధాశుద్ధులఁ బాప, వ్యపగతబుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.౩౬

ధర్మాదులచే పరిశుద్ధులైన వారు, పాపవ్యపగతబుద్ధులు, వినీతి వర్తనులు, సమదృష్టి కలిగిన వారు, నిపుణులు అయినవారిని బాగుగా పరీక్షించి ధనసంపాదనాది రాజకార్యాలలో నియోగింస్తున్నావా? గవర్నమెంటు ఆఫీసర్లకుండాల్సిన
లక్షణాలన్నమాట అవి.
ఉ.
ఉత్తమమధ్యమాధమనియోగ్యుల బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమనియోగములన్ నియమించి తే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగుజీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్.౩౭

రాజ ధర్మాల్ని ఎంత చక్కగా విశదీకరిస్తున్నారో చూడండి. ఉద్యోగులకు దయతో కాలము తప్పకుండా జీతాల్ని చెల్లిస్తుండాలట రాజు. ఎవరెవర్ని ఏ యే పనుల్లో నియోగించాలో బాగా తెలుసుకుని అలానే నియోగించాలట.
క.
తమతమకనియెడుతఱి జీ,తము గానక నవయుభటులదౌర్గత్యవిషా
దము లేలినవాని కవ,శ్యము నె గ్గొనరించు నతఁడు శక్రుండైనన్.౩౮

జీతాలు అందక ఉద్యోగులు బాధపడితే వాళ్ళ దుర్గతివల్ల కలిగే విషాదము ఆరాజు ఇంద్రుడైనా సరే అతనికి చెడును కలిగిస్తాయట.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౩
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబుఁ జెప్పిన నెఱింగి వినతకు మ్రొక్కి వీడ్కొని గరుడుం డతిత్వరితగతిం బఱచి సముద్రోదరంబున నున్ననిషాదుల ననేకశతసహస్రసంఖ్యల వారిం బాతాళవివరంబునుంబోని తన కంఠబిలంబుఁ దెఱచి యందర నొక్క పెట్ట మ్రింగిన నందొక్క విప్రుండుండి కుత్తుకకు డిగక నిప్పునుంబోలె నేర్చుచున్న నెఱింగి నాకంఠబిలంబున విప్రుం డున్న వాఁడేని వెలువడి వచ్చునది యనిన గరుడున కవ్విప్రృం డిట్లనియె.౬౩
ఉ.
విప్రుఁడ నున్నవాఁడ నపవిత్ర నిషాది మదీయభార్య కీ
ర్తిప్రియ దీనిఁబెట్టి చనుదెంచుట ధర్మువె నాకు నావుడున్
విప్రులఁ బొంది యున్న యపవిత్రులుఁ బూజ్యులుగారె కావునన్
విప్రకులుండ వెల్వడుము వేగమ నీవును నీ నిషాదియున్.౬౪
వ.
అనిన నాగరుడుని యనుగ్రహంబున బ్రాహ్మణుండు నిషాదీ సహితుండై వెలువడి వచ్చి గరుడుని దీవించి యథేచ్ఛం జనియె.౬౫

తరువాత కశ్యపుడు చెప్పినమీఁదట ఇంకా బలం కలగటానికి గరుడుడు గజకచ్ఛపాలని ఆరగించి అమృతం సాధించే నిమిత్తం స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ అమృతరక్షకులను నిర్జించి అమృతాన్ని సాధిస్తాడు. అలా సాధించిన వానికి శ్రీహరి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు
సీ.
అమృతాశనంబు చేయకయును దేవ నాకజరామరత్వంబు నందుటయును
నఖిలలోకంబుల కగ్రణివైన నీ యగ్రంబునందు నిన్నధికభక్తిఁ
గొలుచుచు నునికియుఁ గోరితిఁ గరుణతో దయచేయు ముద్ధత దైత్యభేది
యనవుడు వానికి నభిమతంబులు ప్రీతుఁడై యిచ్చి హరి యిట్టులనియె నాకు
ఆ.వె.
ననఘ వాహనంబ వై మహాధ్వజమ వై, యుండుమనినఁ బక్షియును బ్రసాద
మనుచు మ్రొక్కి పరచె నంత నాతనిమీఁద, వజ్రమెత్తి వైచె వాసవుండు.108
వ.
అదియును నంబరమున నగ్ని కణంబులు చెదరం బఱతెంచి పక్షిరాజు పక్షంబుల దాఁకవచ్చినం జూచి గరుడుండు నగి నీ చేయు వేదన నన్నుం దాఁకనోపదు నీవు మహాముని సంభవంబ వగుటను దేవేంద్రునాయుధంబ వగుటను నిన్ను నవమానింపరాదు గావు మదీయైక పర్ణశకలచ్ఛేదంబు సేయుము నాయందు నీ శక్తి యింతియ యనిన సకలభూతసంఘంబులెల్ల నాతనిపర్ణంబులసుస్థిరత్వంబునకు మెచ్చి సుపర్ణుండని పొగడిరి.౧౦౯
వ.
ఇంద్రుడు గరుడునితో స్నేహము చేసి ఆతని బలపరాక్రమములను గురించి చెప్పమంటాడు. అప్పుడు గరుడుడు అతనితో--
క.
పరనిందయు నాత్మగుణో,త్కర పరికీర్తనముఁ జేయఁగా నుచితమె స
త్పురుషుల కైనను నీ క,చ్చెరువుగ నాకల తెఱంగుఁ జెప్పెదఁ బ్రీతిన్.౧౧౪
ఉ.
స్థావరజంగమప్రవితతం బగు భూవలయంబు నెల్ల నా
లావునఁ బూని తాల్తు నవిలంఘ్యపయోధిజలంబులెల్ల ర
త్నావళితోన చల్లుదు బృహన్నిజపక్ష సమీరణంబునన్
దేవగణేశ యీ క్షణమ త్రిమ్మరి వత్తుఁ ద్రివిష్టపంబులన్.౧౧౫

త్రివిష్టపంబులు=మూడు లోకములు
ఇంద్రుడు గరుడునికి అతనికోరికమీద ఉరగభోజనత్వాన్ని అనుగ్రహిస్తాడు.




Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-4
నారదుడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడగుట(కొనసాగింపు)
క.
క్షితినాధ శాస్త్రదృష్టి, ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్పాత
ప్రతికారు లగుచు స,న్మానితు లయి వర్తింతురయ్య నీ దైవజ్ఞుల్.౩౪

రాజు దగ్గర వుండే దైవజ్ఞులైన పురోహితులు దేవ, అంతరిక్ష, భూమిమీఁదా జరిగే ఉత్పాతాలు మొదలైన వానికి సరియైన ప్రతీకారములను ఆచరించి నీచే సన్మానితులగు చున్నారా అని అడుగుతున్నాడు. రాజు అటువంటి వారిని కలిగి ఉండాలన్నమాట.
క.
అనిశము సేవింతురె ని, న్ననఘా యష్టాంగ మైన యాయుర్వేదం
బున దక్షు లైన వైద్యులు, ఘనముగ ననురక్తులై జగద్ధిత బుద్ధిన్.౩౪

వైద్య విధానాలలో ఆయుర్వేదాని కుండే ప్రాధాన్యత అంత గొప్ప దన్న మాట. రాజు దగ్గర ఆయుర్వేదంలో దక్షులైన వైద్యులు కూడా వుండి తీరాలన్నమాట.

క.
సారమతిఁ జేసి మానస, శారీరరుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయు చుండుదె, యారఁగ వృద్ధోపసేవ నౌషధసేవన్.౩౫

మంచి ఆలోచనతో మానసిక, శారీరక రోగాలకు ఎల్లప్పుడు వృద్ధులకు సేవచేయుట ద్వారానూ, మందులిచ్చుటచేతనూ సరియైన ప్రతీకారము కావించు చున్నావా.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౨
గరుడుడు వినతతో పాటుగా కద్రువకు దాస్యము చేస్తూ ఒకనాడు తల్లితో --
ఉ.
ఆయతపక్ష తుండహతి నక్కుల శైలము లెల్ల నుగ్గుగాఁ జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గలనాకు నీపనిం బాయక ఱొమ్మునం దవడుఁ బాముల మోవను వారికిం బనుల్ సేయను నేమి కారణము సెప్పుము నాకుఁ బయోరుహాననా.౪౯
తుండ=ముక్కు
నీపనిం=నీయాజ్ఞను
అవడు=నింద్యమగు
తల్లిని కొడుకు పయోరుహాననా అని సంభోదించటం కొంచెం గమ్మత్తుగా అనిపిస్తోంది-కదూ.
వ.
అని యడిగిన వినత తనకుం గద్రువ తోడి పన్నిదంబున నైన దాసీత్వంబును దత్కారణం బైన యనూరు శాపంబునుం గొడుకున కేర్పడం జెప్పి యిట్లనియె.౫౦
క.
నీ కతమున నా దాస్యము, ప్రాకటముగఁ బాయు ననినపలు కెదలోనం
జేకొని యూఱడి నిర్గత, శోకస్థితి నున్నదానఁ జూవె ఖగేంద్రా.౫౧
వ.
కొడుకులు సమర్థు లైనం దల్లిదండ్రులయిడుములు వాయుట యెందునుం గలయదిగావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసి నై యుండుదాననే యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుండై యొక్కనాడు కాద్రవేయుల కిట్లనియె.౫౨
కరుణతో దాస్యము నుండి విముక్తి కొఱకేమి చేయాలి అని అడిగితే వాళ్ళు దయతో మాకు అమృతం తెచ్చి యిస్తే దాస్యవిముక్తి కలగఁ జేస్తామంటారు. గరుత్మంతుడు అలానే అమృతం మీకు తెచ్చి యిచ్చి తల్లికీ తనకూ దాస్య
విముక్తి కలిగించు కొంటానని వారికి చెప్పి తల్లికీ విషయం చెప్పి తల్లి దీవెన పొందుతాడు. ఈ పని చేయడానికి నాకు చాలా బలం కావాలి, అందుకు నాకు ఆహారం ఏమిటో చెప్పమనగా తల్లి సముద్రము కడుపులో ఉన్న నిషాదగణం ప్రజలకు అపకారము చేస్తుంది కావున ఓ నిమిషంలో ఆ గణాన్ని తిని వెళ్లమని చెప్తుంది. భక్షణ సమయంలో బ్రాహ్మణుని పరిహరించమంటుంది. బ్రాహ్మణునెలాగ తెలుసుకోగలనంటే మ్రింగేటప్పుడు కంఠబిలం నుంచి క్రిందకు దిగకుండా అగ్నికి వలె మంట కలిగించ గలిగిన వాడ్ని బ్రాహ్మణునిగా తెలుసుకొమ్మంటుంది.
తే.
కోపితుం డైనవిప్రుండు ఘూరశస్త్ర, మగు మహా విషమగు నగ్ని యగు నతండ
యర్చితుం డైన జనులకు నభిమితార్థ, సిద్ధికరుఁ డగు గురుఁడగుఁ జేయుఁ బ్రీతి
.౬౨
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబు సెప్పిన,


Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౧
మ.
వివిధోత్తుంగతరంగఘట్టన చల ద్వేలావనై లావలీ
లవలీలుంగలవంగసంగతలతాలాస్యంబు లీక్షించుచున్
ధవళాక్షుల్ సని కాంచి రంత నెదురం దత్తీర దేశంబునం
దవదాతాంబుజఫేనపుంజనిభు నయ్యశ్వోత్తమున్ దవ్వులన్.౩౦
కద్రూవినతలు కశ్యప ప్రజాపతి భార్యలు. ఆయన వలన కద్రువకు వేవురు కొడుకులు(సర్పములు), వినతకు అనూరుడు, గరుత్మంతుడు అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు. అనూరుడు తన తల్లి అండాన్ని తొందరపడి అణచటం వల్ల సగము దేహంతో పుట్టినవాడై తల్లికి సవతికి దాసివి గమ్మని శాపం ఇస్తాడు. తరువాత అనూరుడు సూర్యుని రథసారథిగా వెళ్ళిపోతాడు.
కద్రూవినతలు ఓ రోజు ఉచ్ఛైశ్రవమనే ఒక అతి తెల్లని అశ్వరాజాన్ని చూస్తారు. వారిద్దరూ మాటలలో ఉన్నపుడు కద్రువ వినతతో చూజు ఆ అశ్వం పూర్తిగా తెల్లనిదైనా దాని తోక నల్లగా ఉంది కదా అంటుంది. వినత నీవు ఎలా చూచావో కాని అది మహాపురుషుని కీర్తి వలె పూర్తిగా తెల్లగానే ఉంది, తోకతో సహా అంటుంది. అప్పుడు వారిరువురు ఒకరి కొకరు ఓడితే దాసిగా ఉండేట్లుగా పందెం కాసుకున్నారు.అప్పుడు వినత దగ్గరగా వెళ్ళి చూద్దామంటే కద్రువ ఈ రోజు పతి శుశ్రూషకు వేళ ్యింది గాన రేపు చూద్దామని వాయిదా వేస్తుంది.ఇంటికి తిరిగివచ్చాక
సీ.
కద్రువ కొడుకుల కడ కేగి యేను మి మ్మందఱ వేఁడెద నన్నలార
నా పంపు సేయుండు నన్ను రక్షింపుఁడు కామచారులకు దుష్కరము గలదె
యొడలు తెల్లని తురగోత్తమువాలంబు నల్ల సేసితి రేని నాకు దాసి
యగు మనవినత మీరట్లు సేయనినాఁడు దానికి మఱి యేను దాసి నగుదు
ఆ.వె.
జంటపన్నిదంబు సఱచితి మిట్లుగా, ననినఁ బాము లెల్ల ననయ మిదియుఁ
దల్లి పనిచె నని యధర్మువుసేయంగ, నగునె యెఱుక గలరె మగువ లెందు.౩౪
వ.
అని యందఱుఁ దమలో విచారించి యధర్మారంభమునకు సుముఖులు గాక యున్నఁ గద్రువ కోపోద్దీపితముఖియై.
క.
అనుపమముగ జనమేజయు, డనుజనపతి సేయుసర్పయాగనిమిత్తం
బునఁ బాములు పంచత్వము, సనియెడు మని యురగములకు శాపం బిచ్చెన్.౩౬
వారిలో కర్కోటకు డనేవాడు ఉచ్ఛైశ్రవం తోకను చుట్టుకొని ఉండి నల్లగా కనిపించేలా చేస్తాడు. అది చూచి వినత పందెం ఓడిపోయానని ౫౦౦ సంవత్సరములు కద్రువకు దాసిగా మెలగుతుంది. అప్పుడు రెండవ అండాన్నించి వినతకు గరుత్మంతుడు పుడతాడు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౩
వ.
దాని నెఱింగి కరుణాకలిత హృదయులై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖపాల భరద్వాజ వాలఖిల్యోద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులును బ్రమతియు రురుండును స్థూలకేశాశ్రమంబునకు వచ్చి వ్యపగత ప్రాణయై పడియున్న యక్కన్యకం జూచి దుఃఖితులై యుండ నచ్చోటనుండ నోపక రురుండు శోకవ్యాకుల హృదయుండై యేకతంబ వనంబునకు జని.౧౪౭
వ్యపగత=పోయిన
చ.
అలయక యేన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్
సలుపుదునేని నేన గురుసద్ద్విజ భక్తుఁడనేని నేన య
త్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులార మన్మనో
నిలయకు నీ ప్రమద్వరకు నిర్విష మయ్యెడు నేఁడు మీదయన్.148
చ.
అపరిమితాజ్ఞఁ జేసియు మహాపురుషుల్ విషతత్త్వసంహితా
నిపుణులు మంత్ర తంత్రములు నేర్చి విధించియు దీనికిన్ విష
వ్యపగత మైనజీవ మది వచ్చునుపాయము సేయరొక్కొ నా
తఫముఫలంబు నధ్యయనదాన ఫలంబులు నిత్తువారికిన్.149

వ.
అని దీనవదనుండై యాక్రోశించువానికి నాకాశంబుననుండి యొక్క దేవదూత యిట్లనియె నయ్యా కాలవశంబయిన నెవ్వరికిం దీర్పఁ దరంబు గా దొక్క యుపాయంబు గలదు చేయనోపు దేనిఁ జెప్పెద వినుము నీ యాయుష్యంబునందర్ధం బిక్కన్యకిమ్మనిన రురుం డట్ల చేయుదు నని తన యాయుష్యంబునం దర్ధం బక్కన్యక కిచ్చిన నక్కోమలి దొల్లింటికంటె నధికశృంగార సమన్వితయై విష నిర్ముక్త యయ్యె నట్లు దేవదూత ధర్మరాజానుమతంబునఁ దన చెప్పిన యుపాయంబునం బ్రమద్వరకను బంచత్వంబువలనం బాపె రురుండును దాని వివాహంబై యిష్టోపభోగంబుల ననుభవించుచునుండి.౧౫౦

నిర్ముక్త =వదలిపెట్టబడినది
పంచత్వంబు=మరణము
ఆ తరువాత రురుడు తన భార్య కపకారము చేసిన పాములకు అలిగి పాములన్నిటినీ వెదకి వెదకి మరీ ఓ కర్రతో కొట్టి చంపడం మొదలుపెట్టాడు. అలా ఓ రోజున డుండుభం అనే పేరుగల పామును కొట్టి చంపబోతుండగా ఆ పాము భయపడి అతనితో
మత్తకోకిలము
ఏమికారణ మయ్య పాముల కేలయల్గితి వీవు తే
జోమయుండవు బ్రాహ్మణుండవు సువ్రతుండవు నావుడుం
బాము లెగ్గొనరించె మత్ప్రియభామ కేను రురుండ ను
ద్దామ సత్త్వుఁడ నిన్ను నిప్పుడ దండతాడితుఁ జేసెదన్.౧౫౩
ఇలా అనగానే ఆ డుండుభము ఒక మునిగా ప్రత్యక్షమవుతాడు. రురుడు అతని వివరం అడగ్గా తన పేరు సహస్రపాదుడనీ తాను తన సహాధ్యాయుడు ఐన ఖగముఖుడు అగ్నిహోత్ర గృహంలో ఉండగా పరిహాసం కోసమని ఓ చచ్చిన పాముని అతని మెడలో వేశాను. అప్పుడాతడు దానికి కోపించి నిర్వీర్యమైన పాముగా అయ్యేలా నాకు శాపమిచ్చాడు. శాపవిమోచనం చెప్పమని కోరగా రురుని వలన శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు. అతనింకా ఇలా అన్నాడు.౧౫౬
ఉ.
భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు ను త్తమ
జ్ఞానము సర్వభూతహితసంహిత బుద్ధియుఁ జిత్త శాంతియున్
మాన మద ప్రహాణము సమత్వము సంతత వేదవిధ్యను
ష్ఠానము సత్యవాక్యము ధృడవ్రతముం గరుణాపరత్వమున్.౧౫౭
ప్రహాణము =త్యజించుట
వ.
అయ్యా నీవు బ్రాహ్మణుండవు భృగువంశ సముత్పన్నుండవు సర్వగుణసంపన్నుండ విది యేమి దొడంగి తిట్టి దారుణక్రియారంభంబు క్షత్రియులకుంగాక బ్రాహ్మణులకుం జనునే బ్రాహ్మణు లహింసాపరు లొరులు సేయు హింసలు వారించు పరమ కారుణ్యమూర్తులు జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందుఁ గద్రూ శాపంబుననయ్యెడు సర్పకుల ప్రళయంబును భవత్పితృశిష్యుం డయిన యాస్తీకుండను బ్రాహ్మణుండు కాఁడె యుడిగించె నని చెప్పి సహస్రపాదుండు రురునకు సర్పఘాతంబునం దుపశమనబుద్ధి పుట్టించె ననిన విని శౌనకాది మహామును లక్కథకున కిట్లనిరి.158
ఆ.వె.
ఒరులవలనఁ బుట్టు నోటమియును నెగ్గుఁ, బొరయకుండ నరసి పుత్రవరులఁ
దగిలి కాచునట్టి తల్లి సర్పములకు, నేల యలిగి శాప మిచ్చెనయ్య.
ప్రళయము=నాశమును
ఓటమి=అవమానము
ఆది పర్వము ప్రథమాశ్వాసము సమాప్తము.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౨
చ.
అడిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబులు పల్కి యల్కతోఁ
బొడిచిన నుత్తమద్విజులు పూజ్యులు వారలకెగ్గు సేసినం
జెడు నిహముం బరంబు నిది సిద్ధముగావు టెఱింగి భక్తి నె
ప్పుడు ధరణీసురోత్తములఁ బూజలం దన్పుదు నల్గ నోడుదున్.౧౩౩
వ.
నీవు బ్రాహ్మణుండవు నీ వెద్దిసేసిన నీక చను లోకహితుండ నయిననాకు శాపం బిచ్చి లోకంబులకెల్లఁ జెట్ట సేసితి వ దెట్లనిన వేదోక్తంబులయిన నిత్యనైమిత్తిక బలివిధానంబులందు మహాద్విజులచేత నాయందు వేల్వంబడిన హవ్య కవ్యంబులు నా ముఖంబునన దేవ పితృగణంబు లుపయోగింతు రట్టియేను సర్వభక్షకుండనై యశుచి నైనఁ గ్రియానివృత్తి యగుఁ గ్రియానివృత్తియైన లోకయాత్ర లేకుండు నని యగ్ని భట్టారకుండు నిఖిలలోక వ్యాప్తం బైన తన తేజోమూర్తి నుపసంహరించిన.౧౩౯
సీ.
త్రేతాగ్ను లెల్లను దేజరిల్లమిఁ జేసి క్రతుకృత్యములు వినిర్గతము లయ్యె
నగ్ని హోత్రములందు నౌపాసనాదిసాయంప్రాత రాహుతు లంత నుడిగె
దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతిఁ బొందెఁ
బితృ కార్యములఁ బితృపిండయజ్ఞక్రియ లడఁగె విచ్ఛినంబులై ధరిత్రి
ఆ.వె.
నంత జనులు సంభ్రమా క్రాంతులై మహా,మునులకడకుఁ జనిరి మునులు నమర
వరులకడకుఁ జనిరి వారును వారును, బ్రహ్మ కడకుఁ జనిరి భయము నొంది.౧౪౦
వ.
బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున నగ్నిభట్టారకు నుపసంహారంబును సకల వ్యవహార విచ్థేదంబును నెఱింగి యగ్ని దేవు రావించి యిట్లనియె.౧౪౧
చ.
ప్రకటితభూత సంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృ
త్తికి మఱి హేతుభూతుఁడవు దేవముఖుండవు నీవ లోకపా
వకుఁడవు నీవ యిట్టి యనవద్య గుణుండవు నీకు విశ్వ భా
రకభువన ప్రవర్తన పరాజ్ఞ్ముఖభావముఁ బొందఁ బాడియే.౧౪౨
వ.
అమ్మహాముని వచనం బమోఘంబు గావున నీవు సర్వభక్షకుండవయ్యును శుచులయందెల్ల నత్యంత శుచివై పాత్రులయందెల్లఁ బరమ పాత్రుండవై పూజ్యులయం దెల్ల నగ్రపూజ్యుండ వై వేద చోదిత విధానంబులయందు విప్రసహాయుండవై భువనంబుల నడపు మని విశ్వగురుండు వైశ్వానరుం బ్రార్ధించి నియోగించి భృగువచనంబు ప్రతిష్ఠాపించె నట్టి భృగునకుఁ బుత్త్రుండై పుట్టి పరఁగిన.౧౪౩
క.
చ్యవనునకు సుకన్యక కు, ద్భవ మయ్యె ఘనుండు ప్రమతి ప్రమతికి నమృతో
ద్భవ యగు ఘృతాచికిని భా,ర్గవముఖ్యుఁడు రురుఁడు పుట్టెఁ గాంతియుతుండై.౧౪౪
వ.
అట్టి రురుం డను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకకుం బుట్టినదాని స్థూలకేశుం డను మహాముని నివాసంబునఁ బెరుఁగుచున్న దాని రూపలావణ్యగుణంబులఁ బ్రమదాజనంబులయందెల్ల నుత్కృష్టయగుటం జేసి ప్రమద్వర యన నొప్పుచున్న కన్యక నతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించి యున్నంత.
ప్రమద్వర సర్పదష్టయై చచ్చి మరల బ్రదుకుట
తే.
కన్నియలతోడ నాడుచు నున్నదానిఁ, బాదమర్దితమై యొక్క పన్నగంబు
గఱచెఁ గన్నియలందఱు వెఱచిపఱచి,యఱచుచుండఁ బ్రమద్వర యవనిద్రెళ్లె.౧౪౬


Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౧
ఆస్తీక చరితము- చ్యవనుని వలన బులోముఁ డనురాక్షసుండు చచ్చుట
అప్పుడు శౌనకాది మునులు రౌమహర్షుణునితో సర్పములకు జనమేజయుడు చేయు సర్పయాగములో అగ్నిలో పడుటకు గల కారణాన్ని వివరించమని అడుగుతారు.126
వ.
అని యడిగిన వారికి నక్కథకుం డి ట్లని చెప్పెఁ దొల్లి సర్పకుల జనని యైన కద్రువ శాపంబు కారణంబున జేసి జనమేజయసర్పయాగంబున సర్వభక్షకుం డైన యగ్ని యందు సర్పంబుల కెల్ల నకాండ ప్రళయం బైన దాని భృగువంశజుం డైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుం డుడిగించినట్లు జరత్కార సుతుం డైన యాస్తీకుం డుడిగించె దీనిని సవిస్తరంబుగాఁ జెప్పెద దత్తావధాను లరై వినుండని భృగువంశ కీర్తనంబు నాస్తీకు చరితంబును జెప్పందొడంగె. 128
సీ.
భృగుఁ డనువిప్రుండు మగువఁ బులోమ యన్ దాని గర్భిణిఁ దనధర్మపత్ని
నగ్ని హోత్రమునకు నగ్నులు విహరింపు మని పంచి యభిషేచనార్థ మరుగ
నంతఁ బులోముఁ డన్ వింతరక్కసుఁ డగ్ని హోత్రగృహంబున కొయ్య వచ్చి
యత్తన్విఁ జూచి యున్నత్ముఁ డై యెవ్వరిసతి యిది సెప్పుమా జాతవేద
ఆ.వె.
యనఁగ నగ్ని దేవుఁ డనృతంబునకు విప్ర,శాపమునకు వెఱచి శాపభయము
దీర్చుకొనఁగఁ బోలుఁదీర్ప రాదనృతాభిభాషణము నైన పాపచయము.౧౨౯
వ.
అని విచారించి యప్పరమపతివ్రత భృగుపత్ని యని కలరూపుఁ జెప్పిన నప్పులోముండు నిది నాకు దొల్లి వరియింపబడినభార్య పదంపడి భృగుండు పెండ్లి యయ్యె నని వరాహరూపంబున నాసాధ్వి నతిసాధ్వతచిత్త నెత్తికొని పర్వం బర్వం దద్గర్భంబున నున్న యర్భకుండు గరం బలిగి కుక్షిచ్యుతుండై చ్యవనుండు నాఁ బరఁగె
నమ్మునికుమారుని.౧౩౦
క.
సముదితసూర్యసహస్రో, పమదుస్సహతేజు జగదుపప్ల వ సమయా
సమదీప్తి తీవ్రపావక, సముఁజూచుచు నసుర భస్మ సాత్క్రుతుఁడ య్యెన్.౧౩౧
వ.
పులోమయు నక్కొడుకు భృగుకులవర్ధను నెత్తికొని నిజాశ్రమంబునకు వచ్చె. ముందఱ నారక్కసునకు వెఱచి యక్కోమలి యేడ్చుచుచుం బోయినఁ దద్బాష్ప ధారా ప్రవాహంబు మహానదియై తదాశ్రమ సమీపంబునం బాఱిన దానికి వధూసర యను నామంబు లోకపితామహుండు సేసె నంతఁ గృతస్నానుం డై భృగుండు సనుదెంచి బాలార్కుండునుంబోనిబాలకు నెత్తికొని యేడ్చుచున్న నిజపత్నిం జూచి యసుర సేసిన యపకారంబున కలిగి యయ్యసుర ని న్నెట్లెఱింగె నెవ్వరు సెప్పి రనిన విని పులోమ యి ట్లనియె.
క.
ఈ యగ్ని దేవుఁ డసురకు, నోయనఁ జెప్పుటయు విని మహోగ్రాకృతితో
నాయసుర నన్ను సూకర, మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్.౧౩౩
క.
కుక్షిచ్యుతుఁ డై సుతుఁ డా, రాక్షసు భస్మంబు సేసి రాజితశక్తిన్
రక్షించె నన్ను ననవుడు, నా క్షణమ మునీంద్రుఁ డగ్ని కతిరోషమునన్.౧౩౪
వ.
నీ వతి క్రూరుండవు సర్వభక్షకుండవు గమ్మని శాపంబిచ్చిన నగ్ని దేవుం డి ట్లనియె.౧౩౫

క.
తనయెఱిఁగిన యర్థం బొరుఁ, డనఘా యిదియెట్లు సెప్పుమని యడిగిన జెఁ
ప్పనివాడును సత్యము సె,ప్పనివాఁఢును ఘోరనరకపంకమునఁ బడున్.౧౩౬
వ.
కావున నే నసత్య భయంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కలరూపుఁ జెప్పితి నఖిలజగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీ నోపిన వాఁడనుగాను వినుము.


Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౧౦
చాలాకాలం గడచిన తర్వాత ఉదంకుడు తక్షకు చేసిన యపకారంబునకుం బ్రతీకారంబు సేయం జింతించి యొక్కనాఁడు జనమేజయుపాలికిం బోయి యిట్లనియె.
చ.
మితహితసత్యవాక్య జనమేజయ భూజనవంద్య యేను సు
స్థితి గురుదేవకార్యములు సేయఁగఁ బూను టెఱింగి వంచనో
న్నతమతి యై యకారణమ నా కపకారము సేసెఁ దక్షకుం
డతికుటిలస్వభావుఁడు పరాత్మ విశేషవివేకశూన్యుఁ డై.
వ.
మఱి యదియునుం గాక.
చ.
అనవరతార్థదానయజనాభిరతున్ భరతాన్వయాభివ
ర్థను సకల ప్రజాహితవిధాను ధనంజయసన్నిభున్ భవ
జ్జనకుఁ బరీక్షితున్ భుజగజాల్ముఁ డసహ్యవిషోగ్ర ధూమ కే
తనహతిఁ జేసి చేసె నతిదాంతుఁ గృతాంతనికేతనాతిథిన్.
ఉ.
కా దన కిట్టిపాటియపకారముఁ దక్షకుఁ డేక విప్ర సం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ నీవు ననేకభూసురా
పాదితసర్పయాగమున భస్మము సేయుము తక్ష కాది కా
కోదర సంహతిన్ హుతవహోగ్రసమగ్రశిఖాచయంబులన్.
ఉ.
ప్రల్లదుఁ డైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం
బెల్లను దూషితం బగుట యేమియపూర్వము గావునన్ మహీ
వల్లభ తక్షకాధము నెపంబున సర్పము లెల్ల నగ్నిలోఁ
ద్రెళ్ళఁగ సర్పయాగ మతి ధీయుత చేయుము విప్రసన్నిధిన్.

వ. అని యి ట్లయ్యుదంకుండు జనమేజయునకు సర్పయాగబుద్ధి పుట్టించె.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-౯
ఉదంకుడు తక్షకుని నుండి కుండలాలు తీసుకున్న తరువాత "కుండలములు నాల్గవ రోజుకి తీసుకుని రమ్మని గురుపత్ని నన్ను పంపించింది. ఈ రోజే ఆ రోజు. ఎలా అక్కడికి తిరిగి వెళ్ళగల'' నని ఆలోచిస్తున్న ఉదంకుని అభిప్రాయం తెలుసుకున్న వాడై ఆ దివ్యపురుషుడు ఓ దివ్యహయాన్ని అతనికిచ్చి ఇది నిన్ను క్షణాలలో నీ గురువుగారి దగ్గరకు చేరుస్తుందంటాడు. ఉదంకుడు అలా చేసి సమయానికి కుండలాల్ని గురుపత్నికివ్వ గలుగుతాడు. అప్పుడు గురువు గారతనిని
క.
ఈయున్న పౌష్యుప్రోలికిఁ, బోయి కడుం బెద్దదవ్వు పోయినయ ట్ల
త్యాయతవిమలతపోమహి,మా యిన్ని దినంబు లేల మసలితి చెపుమా.116

ఈ దగ్గరలోనే వున్న పౌష్యుని దగ్గరకెళ్ళి రావడాని కిం తాలస్య మయిందే మయ్యా అని గురువుగారు అడగనే అడుగుతా డు.
వ.
అనిన నుందకుం డిట్లనియె నయ్యా మీయానతిచ్చినట్ల మసల వలవదు. తక్షకుండను దుష్టోరగంబు సేసిన విఘ్నంబున నింత మసల వలసె. వినుడు, మిమ్ము వీడ్కొని చనువాఁడ నెదుర నొక్క మహోక్షంబు నెక్కి చనుదెంచు వాని మహా తేజస్వి నొక్క దివ్యపురుషుం గని వానిపన్నినవృషభగోమయభక్షణంబు సేసి చని పౌష్యుదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చి తక్షకుచేత నపహృతకుండలుండ నై వానిపిఱుందన పాతాళ లోకంబునకుం బోయి నాగపతుల నెల్ల స్తుతియించి యందు సితాసితతంతుసంతానపటంబు ననువ యించుచున్న వారి నిద్దఱ స్త్రీలను ద్వాదశారచక్రంబుఁ బరివర్తింపుచున్న వారి నార్వుర గుమారుల నతి ప్రమాణతురగారూఢుం డైన యొక్క దివ్యపురుషుం గని తత్ప్రసాదంబునఁ గుండలంబులు వడసి నత్తురంగంబు నెక్కి వచ్చితి నిది యంతయు నేమి నా కెఱింగింపుఁ డనిన గురుం డి ట్లనియె.117
సీ.
అప్పురుషుండింద్రుఁ డయ్యుక్ష మైరావతంబు గోమయ మమృతంబు నాగ
భువనంబులోఁ గన్న పొలఁతులిద్దఱు ధాతయును విధాతయు వారి యనువయించు
సితకృష్ణతంతురాజితతంత్ర మది యహోరాత్రంబు ద్వాదశారములు గలుగు
చక్రంబు మాసాత్మసంవత్సరంబు కుమారు లయ్యార్వురు మఱియుఋతువు
ఆ.వె.
లత్తురంగ మగ్ని యప్పురుషుండు ప,ర్జన్యుఁ డింద్ర సఖుఁడు సన్మునీంద్ర
యాది నింద్రుఁ గాంచి యమృతాశివగుట నీ, కభిమతార్థసిద్ధి యయ్యెనయ్య .౧౧౮

మసలు=తడయు
మహోక్షము=పెద్ద యెద్దు
అపహృత కుండలుండు=దొంగిలింప బడిన కుండలములు కలవాడు
సితాసితతంతుసంతానపటంబు=తెల్లని నల్లని దారములతో నేయబడి ఉన్న మగ్గము
ద్వాదశార చక్రంబు=పండ్రెండు బండి యాకులుతో కూడిన చక్రము
ఉక్షము=ఎద్దు
పొలతులు=స్త్రీలు
సితకృష్ణరాజితతంత్రము=తెల్లని నల్లని దారములచేఁ బ్రకాశించు మగ్గము

క.
కర మిష్టము సేసితి మా, కరిసూదన దీన నీకు నగు సత్ఫలముల్
గురుకార్యనిరతు లగు స,త్పురుషుల కగు టరుదె యధిక పుణ్యఫలంబుల్.119

మా యిష్టాన్ని నెరవేర్చావు. నీకు సత్ఫలములు చేకూరుతాయి. గురుకార్యమునందు మిక్కిలి ఆసక్తి గల సత్పురుషులైన వారికి అధిక పుణ్యఫలము కలుగుట అరుదు కాదు కదా.
అని పలికి ఉదంకునికి గురుకులమునుండి స్వేచ్థను ప్రసాదిస్తారు గురువులు.





Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-8
చ.
బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణ సరస్సరస్వతీ
సహితమహీభర మజస్రసహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతరమూర్తికిన్ జలధిసాయికిఁ బాయక శయ్య యైనయ
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.104

ఉదంకుడు కుండలములతో పౌష్యునివద్ద నుండి తిరిగి వస్తుండగా దారిలో అతనికి ఓ జలాశయం కనిపిస్తుంది.
అప్పుడతను ఓ శుచిప్రదేశంలో కుండలాలనుంచి యాచమించు చుండగా అతనితోనే వస్తున్న తక్షకుడు నగ్నవేషధారియై ఆకుండలాలను గ్రహించి పాఱిపోతాడు.ఉదంకుడు కూడా వాడి వెనకే పరిగెత్తి పట్టుకుంటాడు. తక్షకుడు దిగంబర వేషాన్ని విడిచి, కుండలాలను విడవకుండా తన నిజరూపంతో ఓ భూవివరం గుండా నాగలోకానికి వెళతాడు. ఉదంకుడు కూడా వెనకే ఆ వివరం గుండానే నాగలోకానికి వెళ్ళి నాగపతులను ౪ పద్యాలలో తనకు ప్రసన్నం కమ్మని ప్రార్థిస్తాడు. పై పద్యం వానిలోని మొదటి పద్యం. ఆ మిగిలిన మూడు పద్యాలూ ఇవి.
చ.
అరిదితపోవిభూతి నమరారులబాధలు వొందకుండఁగా
నురగుల నెల్లఁ గాచినమహోరగనాయకుఁ డాన మత్సురా

సురమకుటాగ్ర రత్న రుచిశోభితపాదున కద్రి నంద నే

శ్వరునకు భూషణం బయిన వాసుకి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్105


ఉ.
దేవమనుష్యలోకములఁ ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
భావితశక్తి శౌర్యులు నపారవిషోత్కటకోపవిస్ఫుర

త్పావకతాపితాఖిలవిపక్షులు
నైన మహానుభావు లై
రావతకోటిఘోరఫణిరాజులు మాకుఁ బ్రసన్నుఁ లయ్యెడున్.
106

ఉ.
గోత్ర మహామహీధరనికుంజములన్ విపినంబులం గురు
క్షేత్రమునం బ్ర కామగతిఖేలన నొప్పి సహాశ్వసేనుఁ డై
ధాత్రిఁ బరిభ్రమించుబలదర్పపరాక్రమదక్షుఁ డీక్షణ
శ్రోత్రవిభుండు తక్షకుఁడు శూరుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.107

వ.
అని యిట్లు నాగకులంబు నెల్ల స్తుతియించి యందు సితాసితతంతు సంతానపటంబు ననువయించు చున్నవారి నిద్దఱ స్త్రీలను ద్వాదశారచక్రంబుం బరివర్తింపించుచున్నవారి నార్వురఁ గుమారుల నతిప్రమాణతురంగంబు నెక్కినవాని మహాతేజస్వి నొక్కదివ్యపురుషుం గని విపులార్థవంతంబు లైన మంత్రంబుల నతిభక్తియుక్తుం డై స్తుతియించినం బ్రసన్నుం డై యద్దివ్య పురుషుం డయ్యుదంకున కిట్లనియె.108


క.
మితవచన నీయదార్థ, స్తుతుల కతిప్రీతమానసుఁడ నైతి ననిం
దిత చరిత నీకు నభివాం, ఛిత మెయ్యది దానిఁ జెపుమ చేయుదు ననినన్.109


వ.ఉదంకుండు గరంబు సంతసిల్లి యిన్నాగకులంబెల్ల నాకు వశం బగునట్టులుగ ననుగ్రహింపు మనిన నప్పురుషుం డట్లేని నీయశ్వకర్ణరంధ్రాధ్మానంబు సేయుమనిన వల్లె యని తద్వచనానురూపంబు సేయుడుఁ దత్క్షణంబ.110


తక్షకుడు వశమయి కుండలములు తెచ్చి యిస్తాడు.





Unknown
ఆది పర్వము-ప్రథమా శ్వాసము-౭
ఉదంకోపాఖ్యానము
తరువాత జనమేజయుడు సోమశ్రవసుడనే పురోహిడితుని సహాయంతో సమర వచనములకు ప్రతిక్రియగా అనేక శాంతిక పౌష్టిక క్రియలను చేయించి సుఖముగా ఉంటాడు. అది అలా వుండగా--

పైల శిష్యుడైన ఉదంకుడు అనే మునివరుడు తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు గారికి మేలు చేయాలనే ఆలోచనతో గురుపత్ని కోరికమేరకు పౌష్యుడనే రాజు దేవి కుండలములను సంపాదించి తెచ్చి ఇవ్వాలనే కోరికతో వనములో ఒక్కడూ వెళుతుంటాడు. అతని కెదురుగా ఒక పెద్ద ఎద్దునెక్కి వస్తున్న ఒక దివ్యపురుషుని చూచి, అతనిచ్చిన వృషభ గోమయం రుచి చూసి, ఆతని అనుగ్రహం పొంది త్వరగా వెళ్ళి పౌష్యమహారాజును కలుస్తాడు. ఆతని దేవి కుండలములు తన గురుపత్ని కోరిక మేరకు యీయవలసిందని అర్థిస్తాడు. అప్పుడాయన ఇటువంటి మహాత్ముని కివ్వటం తన భాగ్యంగా భావించి, అయ్యా ఆమె ఆ కుండలాల్ని ఇప్పుడు ధరించే వుంది. అంతఃపురానికి వెళ్ళి నామాటగా చెప్పి వాటిని తీసుకోవలసిందని అంటాడు. ఉదంకు డా ప్రకారంగా అంతఃపురానికి వెళ్ళి చూస్తే ఆమె అతని కక్కడ కనిపించదు. తిరిగి వచ్చి రాజు కీ విషయం చెప్పి నీవే వాటిని తెప్పించి యియ్య వలసిందని అంటాడు. అప్పుడా రాజు అయ్యా 'త్రిభువన పూజితుడవైన నిన్ను అశుచి వ' ని ఎలా అనగలను, నా భార్య పరమ పతివ్రత. అశుచులకు కనిపించదు అంటాడు. అప్పుడా ముని తనచే చేయబడిన ఎద్దుపేడను తినడాన్ని గుర్తుకు తెచ్చుకొని, అందుకు పరిహారంగా తూర్పునకు తిరిగి కాళ్ళు చేతులు ముఖం నోరూ వగైరా శుభ్రపరచుకొని ఆ దేవి వద్దకు వెళ్ళి ఆ కుండలాలను ఆమె నుండి తీసుకుంటాడు. ఆమె అప్పుడు తక్షకుడనేవాడు ఆ కుండలాలకోసం ప్రయత్నిస్తున్నాడని, అతనిబారిని పడకుండా రక్షించుకొని వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెపుతుంది. అలానే జాగ్రత్తగా తీసుకొని వెళతానని చెప్పి రాజుగారికి చెప్పి వెళదామని తిరిగి రాజు వద్దకు వస్తాడు. రాజుకు విషయమంతా చెప్పి వెళ్ళివస్తానని అంటే 'పెద్దలు మీరింత దూరం వచ్చి మా దగ్గర భోజనం చెయ్యకుండా ఎలా వెళ్తార'ని బలవంతపెడితే భోజనానికి కూర్చుంటాడు.భోజనం చేస్తుండగా అన్నం లో ఓ వెండ్రుక వస్తుంది. 'అపరీక్షితమైన అన్నాన్ని పెట్టావ'ని కోపించి గుడ్డివాడవవమని శాపం ఇస్తాడు. నీవు స్వల్ప దోషానికే నాకు శాపం యచ్చావు అందుచేత నీకు సంతానం కలగకుండుగాక అని రాజతనికి ప్రతిశాపం ఇస్తాడు. అప్పుడుదంకుడు నేను అనపత్యుడుగా ఉండలేను నీ శాపం ఉపసంహరించుకోమని రాజుని కోర్తాడు. అప్పుడారాజు--
ఉ.
నిండుమనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ
రెండును రాజులందు విపరీతము గావున విప్రుఁ డోపు నో
పండతి శాంతుఁ డయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్.
100

బ్రహ్మణులది నిండైన మనసు, కాని వారి పలుకు మాత్రం దారుణమైన వజ్రాయుధం వంటిది. ఓ జగన్నుతుడా విప్రులందు ఈ రెండూ సహజసిద్ధమైనవి. అందుచేత విప్రుడు శాపం ఉపసంహరించగలుగుతాడు. కాని రాజులందు ఈ రెండూ వ్యతిరేకంగా వుంటాయి. కాబట్టి రాజుకు శాపం ఉపసంహరించగలిగే సామర్థ్యం ఉండదు. కాబట్టి నేను నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను, దయతో నీ శాపాన్ని నీవు వెనక్కి తీసుకోమంటాడు. సరే స్వల్పకాలం లోనే నీకు శాపవిమోచన జరుగుతుందని చెప్పి తన గురు పత్ని కోరిక తీర్చగలుగుతున్నాను గదా అనే సంతోషంతో వెళ్తుంటాడు.

ఈ పైన వ్రాసిన 100 వ పద్యం అంటే ఎందుకో చెప్పలేను కాని నాకు విపరీతమైన ఇష్టం. కారణం నాకూ తెలియదు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-6
క.
తగు నిది తగ దని యెదలో, వగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁజేయు దుర్వినీతుల, కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్.
85

ఇక్కడ నుంచే భారత కథ మొదలవుతుంది.

పాండవులలో అర్జునుని కుమారుడైన అభిమన్యునికి పరీక్షిత్తు అతనికి జనమేజయుడు పుడతారు.ఈ జనమేజయునకు వైశంపాయనుడు చెప్పేకథగా, శౌనకాది మునులకు రోమహర్షణుడు చెప్తున్నట్లుగా భారతం చెప్పబడుతుంది.

జనమేజయుడు ఒకప్పుడు సత్త్రయాగాన్ని చేస్తుండగా దేవతల కుక్క సరమ యొక్క కుమారుడు సారమేయుడనేవాడు ఆడుకుంటూ అక్కడకు వస్తాడు. ఆ సారమేయుడిని జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు,భీమసేనుడు,ఉగ్రసేనుడు అనేనాళ్ళు కొడితే అది అరుచుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మకు పిర్యాదు చేస్తుంది. అప్పుడు సరమ జనమేజయునివద్దకు వచ్చి ఇలా అంటుంది.నీ తమ్ముళ్ళు తప్పుచేయని నా కొడుకుని కొట్టారు ఇది అన్యాయం అంటూ. పైన చెప్పిన విషయం చెపుతుంది.
ఇది తగును, ఇది తగదు అని మనసులో ఆలోచించకుండా సాధువులకు పేదవారికి ప్రయత్నంచి చెడు చేసే దుష్టులైనవారికి నిమిత్తమేమీ లేకుండానే వచ్చే భయాలు కలుగుతాయి.ఇది చెప్పి సరమ అక్కడనుంచి అదృశ్యమయిపోతుంది.

భారతప్రారంభం లోనే చెప్పబడిన బంగారం లాంటి సూక్తి ఇది. ఓ ఆణిముత్యం. ఇటువంటి ఆణిముత్యాలు భారతం నిండా ఎన్నో, ఎన్నెన్నో.... మన ప్రయత్నమే తరవాయి.రండి మనందరం కలసి బారతం లోని ఆణిముత్యాలను ఏరి భద్రపరచుకుందాం. మన పిల్లలకీ అందిద్దాం.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
అనఘుల శాస్త్రవిధిజ్ఞుల, ననురక్తులఁ బితృపితామహక్రమమున ప
చ్చినవిప్రుల మంత్రుల, గా, నొనరించితె కార్యసంప్రయోగము పొంటెన్.27

పాపరహితులను, శాస్త్రవిధిజ్ఞులను, అనురాగము గలవారిని పితృపితామహక్రమమున వచ్చిన విప్రులను మంత్రులుగా నియమించుకోవాలట.
క.
రాజునకు విజయమూలము, రాజితమంత్రంబు సుస్థిరంబున దానిన్
రాజాన్వయ రక్షించితె ధ, రాజనులకుఁ గర్ణ గోచరము గాకుండన్. 28

ప్రసిద్ధమగు రహస్యము (సీక్రెట్ సర్వీస్) రాజులవిజయానికి మూలమైనది.
దానిని ఎవ్వరికీ తెలియకుండగా రాజయినవాడు రక్షించుకోవాలి.
క.
ధీరుఁడు ధర్మాధర్మవి, శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీశ్రితవదనస,రోరుహుఁడనఁ జనునె నీ పురోహితుఁ డధిపా.29

ఇక్కడ పురోహితుని లక్షణాల్ని చెపుతున్నాడు. పురోహితునికి పై లక్షణాలన్నీ
ఉండాల్సిందే. అతడు ధీరుడై, ధర్మాధర్మ విశారదుడై, బహు శ్రుతులను
చదివినవాడై, సమచిత్తుడై, సరస్వతీ దేవి అతని ముఖాన్ని
ఆశ్రయించుకొనివున్నదైనవాడై ఉండాలట. నీ పురోహితు డటువంటివాడే కదా.
క.
జననుత నీయజ్ఞములం, దనవరతనియుక్తుఁ డయినయాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁ డై యేమఱ కుం,డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్.30

నీ యజ్ఞములను ఎల్లకాలము నిర్వహించడానికి నియుక్తుడైన యాజ్ఞికుఁడు
ప్రయోగాలు చేయుటలో సిద్ధహస్తుడై తన పనులను ఎప్పుడూ సమబుద్ధితో
చేస్తూ ఉన్నాడా.
క.
నానావిధరణవిజయమ, హానిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్
సేనాధ్యక్షులఁ జేసితె, నీ నమ్మినవారి మాననీయుల హితులన్.31

నానా విధములయిన యుద్ధాలలో మహా నిపుణులై వారింపనలవికాని
వీరులనతగువారిని సేనాధ్యక్షులుగా చేసుకొన్నావా? వారు నీకు
నమ్మినవారు, మాననీయులు, హితులే కదా?
చ.
చ.
కడుఁ జనువాఁడు నై పురుషకారియు దక్షుఁడు నైనమంత్రి పెం
పడరఁగ రాజపుత్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా ధనమెట్టివారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్.32

ఇక్కడ గుణవంతుడైన మంత్రి లక్షణాన్ని వర్ణిస్తున్నాడు.




Unknown
సభా పర్వము-ప్రథమాశాస్వము-౨
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట
భారతంలో చాలా చోట్ల వివిధములైన ధర్మాలను చెప్పటం జరిగింది.
ఈ సందర్భంలో నారదుడు ధర్మరాజుని అడిగినట్లు పరోక్షంగా వివిధములైన
రాజధర్మాలను ఉపదేశించటం జరిగింది.

సీ.
మీ వంశమున నరదేవోత్తముల దైన సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మ విదుండ వై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గాఁ జేసి సేవింతె ధర్మవునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపర రాత్రమ్ములం దెప్పుడుఁ జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన
ఆ.
రాజకృత్యములఁ దిరంబుగా నిఖిల ని, యోగవృత్తులందు యోగ్యు లయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె, నీవు వారి దయిమ నే ర్పెఱింగి.26

ఓ ధర్మరాజా! మీ వంశమున రాజశ్రేష్ఠులదైన సద్ధర్మమార్గాన్ని సలుపుతున్నావా!
ధర్మవిదుడవై ధర్మార్థకామాలు ఒకదానితో నొకటి బాధింపబడకుండగా కాల
విభజనం చేసి సేవిస్తున్నావా! ధర్మమునందే మనస్సును నిలిపి రాత్రి నాల్గవ
జాములో చింతన చేస్తున్నావా! స్వబుద్ధితో చేయదగిన రాజకార్యాలు ఎవరు
ఏయే పనులు చేయసమర్థులో వారి వారి నాయా కార్యాలలో సరిగా గౌరవముతో
చేయటానికి నియమించావా!
(ఇంకావుంది)
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-5
ఉ.
ఇమ్ముగ సర్వలోక జనులెవ్వనియేనిముఖమృతాంశుబిం
బమ్మున నుద్భవం బయిన భారతవాగమృతంబు కర్ణరం
ధ్ర మ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యు మ్ముని నప్పరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.76

ప్రసిద్ధిగా సర్వలోక జనులు ఎవ్వని చంద్రబింబమువంటి ముఖాన్నుండి
వెలువడే భారతవాగమృతమును చెవి రంధ్రమనే అంజలిని పట్టి త్రాగుతారో
అట్టి మునీంద్రుడు, లోకముచే పొగడబడ్డ- పరాశరసుతుడైన వ్యాసునికి
మిక్కిలి భక్తితో ప్రణమిల్లి--రోమహర్షణుడు భారతగాథను ప్రారంభిస్తున్నాడు.

అక్షౌహిణీ సంఖ్యావివరము.
సీ.
వరరథ మొక్కండు వారణ మొక్కండుతురగముల్మూఁడు కాల్వురును నేవు
రనుసంఖ్య గలయదియగుఁ బత్తి యదిత్రిగుణంబైనసేనాముఖంబు దీని
త్రిగుణంబు గుల్మంబు దీనిముమ్మడుఁ గగుగణముతద్గణముత్రిగుణిత మైన
వాహినియగు దానివడిమూఁటగుణియింపఁ బృతన నాబరఁగుఁదత్పృతనమూఁట
ఆ.
గుణితమైనఁ జము వగున్ మఱి దానిము,మ్ముఁగనీకినీసమాఖ్య నొనరు
నదియుఁ బదిమడుంగులైన నక్షౌహిణి, యౌ నిరంతర ప్రమానుసంఖ్య.80

ఈ మధ్యనే ఓ బ్లాగరి అక్షౌహిణీ సంఖ్యను గురించి వారి బ్లాగులో వ్రాసారు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు భటులు - బత్తి
౩ బత్తిలు ఒక సేనాముఖము
౩ సేనాముఖములు ఒక గుల్మము
౩ గుల్మములు ఒక గణము
౩ గణములు ఒక వాహిని
౩ వాహినులు ఒక పృతన
౩ పృతనలు ఒక చమువు
౩ చమువులు ఒక అనీకినీ సమాఖ్య
౧౦ అనీకినీ సమాఖ్యలు ఒక అక్షౌహిణి.
అంటే ఒక అక్షౌహిణికి ౨౧౮౭౦ రథములు, ౨౧౮౭౦ ఏనుగులు, ౬౫౬౧౦ గుఱ్ఱములు,
౧౦౯౩౫౦ మంది వీరభటులు గలది. ఇటువంటి ౧౮ అక్షౌహిణులు మహాభారత యుద్ధంలో
పాల్గొన్నాయి.అంటే మొత్తం ౩,౯౩,౬౬౦ రథములు, ౩,౯౩,౬౬౦ ఏనుగులు,
౧౧,౮౦,౯౮౦ గుఱ్ఱాలు, ౧౯,౬౮,౩౦౦ వీరభటులూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-4
సీ.
ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక విహితావధాను లై వినుచు నుండు
వారికి విపులధర్మార్థారంభసంసిద్ధి యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్ నాలుగు నాదిపురాణముల్ పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్త్వంబులు నెఱిఁగినఫల మగు నెల్లప్రొద్దు
ఆ.
దానములను బహువిధక్రతుహుతజప, బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలము వడయఁ బోలు నశేషపా,పక్షయంబు నగుశుభంబు వెరుఁగు.71

ఈ మహాభారతాన్ని శ్రద్ధగా వినేవారికి అనేక ధర్మార్ధాలను ప్రారంభం చేసిన సిద్ధి
అవుతుంది.శ్రమలేకయె పరమార్థం సిద్ధిస్తుంది. నాలుగు వేదాలు, పద్ధెనిమిది
పురాణాలు, వానిలో చెప్పబడే ధర్మశాస్త్రములు, మోక్షశాస్త్ర తత్త్వములు
తెలుసుకొన్న ఫలం కలుగుతుంది .ఎల్లప్పుడూ దానములను, బహువిధమైన
క్రతువులను, జపము బ్రహ్మచర్యము వలనికలుగు పుణ్యఫలము కలుగుతుంది.
పాపాలు నశిస్తాయి. శుభాలు పెరుగుతాయి.
ఉ.
సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.72

వ్యాసుఁడనెడి యాకాశమునుండి దేవేంద్రుడనెడి సముద్రమును కలసి
శోభనుపొందు జగద్విదితమగు భారతీయభారతి అనబడే దేవనదీ
ప్రవాహము నిరంతరము విన్నవారికి, కొనియాడిన వారికందరికీ
సంతతమైన పుణ్యసంపదలను అధికంగా అభివృద్ధి నొందిస్తుంది .


Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-3
మ.
అమితాఖ్యానక శాఖలం బొలిచి వేదార్థామలచ్ఛాయ మై
సుమహా వర్గచతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో
త్తమనానాగుణకీర్తనార్థఫల మై ద్వైపాయనోద్యానజా
తమహాభారతపారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్య మై.65

అమితమైన ఛిన్నకథలనే కొమ్మలతో ప్రకాశిస్తూ వేదార్థములతోడి
నిర్మలమైన నీడతో వివిధరకములైన మంచిగొప్పపుష్పవితతితో
శోభనొంది కృష్ణార్జునుల ఉత్తమ నానాగుణ కీర్తనల అర్థముయొక్క
ఫలమై ద్వైపాయనమనే వనములో పుట్టిన పారిజాతవృక్షము
భూదేవతల(బ్రాహ్మణుల) చే ప్రార్థితమై అలరారుతుంది.

మహాభారతం నిజంగామనకోసం ఏర్పరచబడిన పారిజాత వృక్షమే,
అందుచేతే ఆ గ్రంధపఠనం మన అనేక కోరికలను తీరుస్తుంది.
పూర్తి గ్రంధం చదవాలనున్నా చదవలేని వారనేకమంది. వారి
సౌకార్యార్థం క్లుప్తంగా నైనా తెలియ చేద్దామనేదే ఈ చిన్ని ప్రయత్నం.
మిడి మిడి జ్ఞానంతో చేసే ఈ ప్రయత్నంలో ఏమైనా తప్పులు దొర్లితే
క్షమించి సరిదిద్ది ప్రోత్సహించ గలందులకు విజ్ఞులైన బ్లాగ్మిత్రులను
ఇందుమూలంగా వేడుకొంటున్నాను.

వ.
ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థప్రపంచసంచితంబు నుపపర్వమహాపర్వోప
శోభితంబు నుపద్వీపమహాద్వీపసంభృతం బయిన భువనం బజుండు
నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిలలోకహితార్థంబు దత్తావధానుండై
సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకమునందు వక్కాణింప నారదుం
బనిచెఁ బితృలోకంబున వక్కాణింప నసితుండైన దేవలుం బనిచె
గరుడగంధర్వయక్షరాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచె
నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె మనుష్యలోకంబున
జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నా
వైశంపాయనమహామునివలన విని వచ్చితిఁ ,
కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబునుం
బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహా ఘోర యుద్ధం బయ్యె.౬౬
మహా భారత నిర్మాణానికి సంవత్సరములు పట్టిందట. దానిని ప్రచారం చేయటానికి దేవలోకానికి నారదుడిని, పితృలోకానికి అసితుడైన దేవలుడినిగరుడగంధర్వయక్షరాక్షసలోకాలకి శుకుడిని,నాగలోకానికి సుమంతుడిని,మనుష్యలోకములో జనమేజయునికి చెప్పడానికి వైశంపాయన మహర్షిని పంపించాడు. నేనా వైశంపాయుని వలన విని వచ్చాను. పూర్వం కృతయుగానంతరం దేవదానవులకు, త్రేతా యుగాతంలో రామరావణ యుద్ధం జరిగినట్లే ద్వాపర యుగాంతంలో పాండవ ధార్తరాష్ట్రులకు మహా ఘోరమైన యుద్ధం జరిగింది.
Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-2
చ.
అమల సువర్ణ శృంగఖుర మై కపిలం బగుగోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసినఁదత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబుకావునన్.15

స్వచ్ఛమైన బంగారపు కొమ్ములను గిట్టలను కలిగి, కపిలవర్ణము గల నూరు
గోవులను ఉత్తములైన బహువేదములలో పరిశ్రమ చేసిన విప్రులకు దానము
చేసిన వలన కలిగే ఫలం తప్పనిసరిగా సమకూరుతుంది భారత గాథను
విన్నటువంటి వారికి. నా చిత్తము ఎల్లప్పుడూ భారతకథను వినుటయందు ఆసక్తి
కలిగి ఉంటుంది.
క.
బహుభాషల బహువిధముల, బహుజనములవలన వినుచు భారతబద్ధ
స్పృహులగువారికి నెప్పుడు, బహుయాగంబులఫలంబు పరమార్థమగున్.17

వ. అని యానతిచ్చిన విని యక్కవివరుండిట్లనియె.18
చ.
అమలినతార కాసముదయంబుల నెన్నను సర్వ వేదశా
స్త్రంబుల యశేషసారము ముదంబునఁ బొందను బుద్ధి బాహువి
క్రమమున దుర్గమార్థజలగౌరవభారత భారతీసము
ద్రముఁ దఱియంగ నీఁదను విధాతృన కైనను నేరఁ బోలునే.19

స్వచ్ఛమైన నక్షత్రాలను లెక్కించను, అన్నివేదాలసారాన్ని సంతోషముతో
పొందుటను, భారత భారతీ సముద్రాన్ని దాటేలా యీదగలగటం --యివి
విధాతకైనా సాధ్యం కానివి.
క.
ఏయది హృద్య మపూర్వం, బేయది యెద్దాని వినిన నెఱుక సమగ్రం
బై యుండు నఘనిబర్హణ, మేయది యక్కథయ వినఁగ నిష్టము మాకున్.29

రోమహర్షుణుని పుత్రుడైన రౌమహర్షణి, శౌనకాది మునులతో, ఏకథను నా వలన
వినగోరుతున్నారని అడిగినప్పుడు వారంతా పై విధంగా పలికారట.
సీ.
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రం బని యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతి శాస్త్రంబని కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు లక్ష్యసంగ్రహమని యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్ఛయం బని మహిఁ గొనియాడుచుండ
ఆ.
వివిధ వేదతత్త్వవిదుఁడు వేదవ్యాసుఁ, డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీన మై, పరఁగుచుండఁ జేసె భారతంబు.31

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం అంటారట. అధ్యాత్మవిదులు వేదాంతం అంటారట.
నీతివిచక్షణులు నీతి శాస్త్రం అంటారట. కవివృషభులు మహాకావ్యం అంటారట.
లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహం అంటారట.ఐతిహాసికులు ఇతిహాసమంటారట.
పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయం అంటారట. ఈ విధంగా ఈ
భూమి మీద కొనియాడుచున్న మహాభారతాన్ని
వివిధ వేదతత్త్వవిదుఁడు,
ఆదిముని, పరాశరమహర్షి కుమారుడు ఐన వేదవ్యాసుడు విష్ణుసన్నిభుడు
విశ్వానికంతా శుభం కలగాలని రచన చేసాడు.
సీ.
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు నర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియుఁ
బుత్త్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించు వినుచుండువారల కిమ్మహాభారతంబు.
ఆ.
భక్తియుక్తు లైన భాగవతులకు శ్రీ,వల్లభుండు భక్తవత్సలుండు
భవభయంబులెల్లఁ బాపి యిష్టార్థసం,సిద్ధిఁ గరుణతోడఁ జేయునట్లు. 33

ఆయువు కోరేవారికి దీర్ఘాయువు, ధనముకోరేవారికి ఎక్కువ ధనసంపద,
ధర్మాన్ని కోరేవారికి నిత్యధర్మప్రాప్తి, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయసంపద,
పుత్రసంతానం కోరేవారికి బహుపుత్ర సమృద్ధి, సంపదలు కోరేవారికిష్టసంపదలు,
కావిస్తుంది ఎప్పుడూ భారతాన్ని భావించి వినేవారికి. అదెలాగంటే భక్తవత్సలుడైన
శ్రీవల్లభుడు భక్తియుక్తులైన భాగవతులకు భవభయాలన్నిటిని పోగొట్టి కరుణతో
యిష్టార్థ సంసిద్ధిని కలిగించినట్లుగా నన్నమాట.


Unknown
స్త్రీ పర్వము-ప్రథమాశ్వాసము-1
చచ్చిన వీరులకు ఉదకప్రదానాదులు చేయుట
తరల.
ధరణినాయక యట్లు పుత్రశతంబు వైరికులంబు చే
నిరవశేషత నొందుటన్ మహనీయగౌరవహీనతం
బొరసి కొమ్మలు తున్మ మ్రోడ్పడుభూరుహంబును బోలె ని
ర్భరవిపద్వికలాత్ముఁడై ధృతరాష్ట్రుఁ డుల్లము వెమ్మగన్.4

అలా నూర్గురు పుత్రులు వైరులచే చచ్చుటచే కొమ్మలన్నీ తుంచగా మోడయి నిలచిన భూరుహమును పోలి ఉన్నాడట ఆ ధృతరాష్ట్రుడు.
వ.చింతాభరంబున నూరక యున్నం జూచి సంజయుం డతని కిట్లనియె.5
వ.
పదునెనిమిదియక్షౌహణిలు సమసెఁ బితామహపితృభాతృపుత్రపౌత్రసఖిసుహృత్సహాయులుం దెగి రందు వగపునకుం బని గానివారలు కలరే యేది కొలందిగా నగ చె దందఱకు నగ్ని కార్యంబు నిర్వర్తింపను దగినవారలకుం దిలోదకప్రదానంబులు చేయను వలయుఁ బొలిగలనికి(స్మశానము) వేంచేయుము.7