Unknown
ఆది పర్వము-సప్తమాశ్వాసము-1
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35

ఈ వాక్యాన్ని వ్యాసులవారు పాండవులతో అన్నారు. పాండవులు ఏకచక్రపురాన్ని విడిచి పెట్టి ద్రుపదుని పురానికి వెళ్ళేదారిలో వారికి వ్యాసమహర్షుల వారి దర్శనం అవుతుంది. ఆ సందర్భంగా అన్నమాటలు ఇవి.
ద్రుపదునికి పుత్రకామేష్టి యజ్ఞం చేయగా అందు అగ్నిదేవుని వలన .
క.
జ్వాలాభీలాంగుఁడు కర, వాలబృహచ్చాపధరుఁడు వరవర్మ కిరీ
టాలంకారుఁడు వహ్నియ, పోలె రథారూఢుఁ డొక్కపుత్త్రుఁడు పుట్టెన్. 18
వ.
మఱియు. 19
తరలము.
కులపవిత్ర సితేతరోత్పలకోమలామలవర్ణి యు
త్పలసుగంధి లసన్మ హోత్పలపత్ర నేత్ర మదాలికుం
తులవిభాసిని దివ్య తేజముఁ దాల్చి యొక్క కుమారి త
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్. 20
వ.
ఇట్లు పుట్టిన కొడుకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జన వినుతంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి బ్రాహ్మణులం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేద పారగుం జేయించి యున్నంత నక్కన్య యిపుడు వివాహసమయ ప్రాప్త యయిన. 21