Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౧౦
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
ఆ.వె.
దారసంగ్రహంబు ధరణీశ రతిపుత్ర, ఫలము శీలవృత్త ఫలము శ్రుతము
దత్తభుక్త ఫలము ధనము వేదము లగ్ని,హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు
.౫౨

పెళ్ళికి రతి సుఖము, పుత్రులు కలుగుట ఫలము. శ్రుతులను వినటం వలన ఫలితం మంచి నడవడికను పొందటం. ఢబ్బుకు దానము, భోగము ఫలము. వేదమునకు ఫలం అగ్నిహోత్రం. అని తెలుసుకో.
చ.
బహుధనధాన్యసంగ్రహంబు బాణశరాసన యోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘసం

గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా

వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లై న దుర్గముల్.
౫౩
దుర్గ రక్షణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు.
బహు ధన ధాన్య సంగ్రహం ఐ వుండాలి. బాణాలను శరములను ప్రయోగించగల వీరులతో వుండాలి.నిరంతరాయంగా మంచినీరు, తృణజలకాష్ఠసమూహంతో కూడి వుండాలి.అనేక యంత్రములు కలిగి శత్రువులకు భేధించరానిదై వుండాలి.
ద్విషద్భయా వహులు=?. నీచే రక్షించబడే కోట పై విధంగా వుందా? అని అడుగుతున్నాడు నారదుడు.
చ.
వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ

విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు

ర్మదమలినాంధ చిత్తులఁ
బ్రమత్తులఁ నింద్రియనిర్జితాత్ములన్.౫౪

మంచి బుద్ధితో నీలోపలనున్న శత్రువర్గాన్ని వదలకుండా జితేంద్రియుడ వై మొదలనే దేశకాలబలములు ఇంకా దైవబలమూ కూడా కల్గి శత్రువులను ఓడించడానికి ఉత్సాహముతో నున్నావా.ఇంద్రియాలను వశపరచుకొనే వానిని జాగరూకుడవై కనిపెట్టుకుని వుంటున్నావా.
తే.
కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న, నీకు ముందఱఁజని రిపునృపులయందు దగిలి సామాద్యుపాయంబులొగినసంప్ర,యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.౫౪

నీవు యుద్ధానికి వెళ్ళేప్పుడు నీకంటే ముందుగా వెళ్ళి శతృవులలో చేరి సామాద్యుపాయములతో నీ విజయానికి సహాయకారిగా చేసుకొంటున్నావా చెప్పు.
వ.
మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం లనర్థజ్జ్ఞులతోడిచింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబులయం దనర్థకచింత నిశ్చితకార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబుల బ్రయోగింపమి విషయంబులం దగులుట యనం బరగిన పదునాలుగు రాజదోషంబుల పరిహరించితె యని నారదుడు ధర్మరాజును అడుగుతాడు.౫౬
రాజైనవాడు పరిహరించాల్సిన పద్నాలుగు దోషాలను తెలియజేస్తాడిక్కడ.