Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౨
గరుడుడు వినతతో పాటుగా కద్రువకు దాస్యము చేస్తూ ఒకనాడు తల్లితో --
ఉ.
ఆయతపక్ష తుండహతి నక్కుల శైలము లెల్ల నుగ్గుగాఁ జేయు మహాబలంబును బ్రసిద్ధియునుం గలనాకు నీపనిం బాయక ఱొమ్మునం దవడుఁ బాముల మోవను వారికిం బనుల్ సేయను నేమి కారణము సెప్పుము నాకుఁ బయోరుహాననా.౪౯
తుండ=ముక్కు
నీపనిం=నీయాజ్ఞను
అవడు=నింద్యమగు
తల్లిని కొడుకు పయోరుహాననా అని సంభోదించటం కొంచెం గమ్మత్తుగా అనిపిస్తోంది-కదూ.
వ.
అని యడిగిన వినత తనకుం గద్రువ తోడి పన్నిదంబున నైన దాసీత్వంబును దత్కారణం బైన యనూరు శాపంబునుం గొడుకున కేర్పడం జెప్పి యిట్లనియె.౫౦
క.
నీ కతమున నా దాస్యము, ప్రాకటముగఁ బాయు ననినపలు కెదలోనం
జేకొని యూఱడి నిర్గత, శోకస్థితి నున్నదానఁ జూవె ఖగేంద్రా.౫౧
వ.
కొడుకులు సమర్థు లైనం దల్లిదండ్రులయిడుములు వాయుట యెందునుం గలయదిగావున నీయట్టి సత్పుత్రుం బడసియు దాసి నై యుండుదాననే యనిన విని వైనతేయుండు తద్దయు దుఃఖితుండై యొక్కనాడు కాద్రవేయుల కిట్లనియె.౫౨
కరుణతో దాస్యము నుండి విముక్తి కొఱకేమి చేయాలి అని అడిగితే వాళ్ళు దయతో మాకు అమృతం తెచ్చి యిస్తే దాస్యవిముక్తి కలగఁ జేస్తామంటారు. గరుత్మంతుడు అలానే అమృతం మీకు తెచ్చి యిచ్చి తల్లికీ తనకూ దాస్య
విముక్తి కలిగించు కొంటానని వారికి చెప్పి తల్లికీ విషయం చెప్పి తల్లి దీవెన పొందుతాడు. ఈ పని చేయడానికి నాకు చాలా బలం కావాలి, అందుకు నాకు ఆహారం ఏమిటో చెప్పమనగా తల్లి సముద్రము కడుపులో ఉన్న నిషాదగణం ప్రజలకు అపకారము చేస్తుంది కావున ఓ నిమిషంలో ఆ గణాన్ని తిని వెళ్లమని చెప్తుంది. భక్షణ సమయంలో బ్రాహ్మణుని పరిహరించమంటుంది. బ్రాహ్మణునెలాగ తెలుసుకోగలనంటే మ్రింగేటప్పుడు కంఠబిలం నుంచి క్రిందకు దిగకుండా అగ్నికి వలె మంట కలిగించ గలిగిన వాడ్ని బ్రాహ్మణునిగా తెలుసుకొమ్మంటుంది.
తే.
కోపితుం డైనవిప్రుండు ఘూరశస్త్ర, మగు మహా విషమగు నగ్ని యగు నతండ
యర్చితుం డైన జనులకు నభిమితార్థ, సిద్ధికరుఁ డగు గురుఁడగుఁ జేయుఁ బ్రీతి
.౬౨
వ.
అని బ్రాహ్మణ స్వరూపంబు సెప్పిన,