Mar
28
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-
వ.
"కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం, కికాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే." యని నీవు తొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుండగు హరిహరనాధుండు నీ దెస దయాళుం డై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోకనివాసియయిన నాకుఁ దనదివ్యచిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టిశక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయం చేయుచున్నవాఁ డనుచుం జూపుటయు సవిశేషసంభ్రమసంభరితహృదయుండ నయి గలయం గనుంగొను నప్పుడు.౧౧
పరిష్క్రియాయాం=అలంకారము నందు
అవధరించి=చిత్తగించి
సీ.
కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున శశిరెఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందనమున్న గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱి యైన చెలువున నెఱసినలోకరక్షణ మన గరళంబుచాయ దోఁప
బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబంబు నా నురమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే.
సురనదియును గాళిందియు బెరసినట్టి, కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముగఁ జేయ, నెలమి సన్నిధి సేసే సర్వేశ్వరుండు.౧౨
హరినీలపాత్రిక=ఇంద్రనీలమణుల పాత్ర, గుఱి=గురుతు
క.
పారాశర్యుని కృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద,ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్.౧౭
పారాశర్యుడు=వేదవ్యాసుడు
ఆరాధ్యము=పూజింపఁదగినది
తే.
తెనుఁగు బాస వినిర్మింపఁ దివురుటరయ, భవ్యపురుషార్థతరుపక్వ ఫలముగాదె
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిప,తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ.౧౮
ఎడ=హృదయము
ఉ.
ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
త్యంతవిభూతిఁ బెం పెసఁగునట్టినినుం గొనియాడ జేత దా
నెంతటిపెద్ద నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.౨౧
చేఁత=చేయుట
ఉ.
ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారతసంహితఁ జెప్పఁ గంటి నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.౨౭
పుట్టు=జన్మము, భారతసంహిత=భారతమను నితిహాసము
ఉ.
కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్ జనా
భ్యర్చిత మైన భారత మపారకృపాపరతంంత్రవృత్తిమైఁ
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా
నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్.౨౮
వరణీయుఁడ=కోరదగినవాడను
ఉ.
కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావలి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదం బయిన చిత్తము తోడ మహాకవిత్వదీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్.౩౦
గర్ణపుటంబుల=చెవులను దొప్పలచేత
సాత్యవతేయసంస్మృతి శ్రీవిభవాస్పదంబు=వ్యాసుని స్మరణము అను సంపదయొక్క మహిమకు చోటు
అని విన్నపం చేసుకొని తిక్కన గారు భారత రచన కుపక్రమించారు.













Mar
28
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౪
ధర్మరాజు ధౌమ్యునితో నిట్లనియె.
తే.
వనమునకు వచ్చి నవయంగ వల దుడుగుఁ, డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్ వీరికాహార మేయు,పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు.౩౬
వ.
వీరల విడువనోప నేమిసేయుదు ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరాజున కి ట్లనియె.౩౭
ఆ.వె.
భూత రాశి తొల్లి పుట్టి బుభుక్షాభి,తప్త యినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి , కమలభాంధవుండు కరుణ తోడ.౩౮
కమలబాంధవుండు=సూర్యుఁడు
వ.
ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి దక్షిణాయనగతిం బర్జన్యభూతుం డై యోషధులం బడసి రాత్రులయందుఁ జంద్రకిరణాంమృతంబునంజేసి వానిం దడుపుచు వర్ధించి యం దన్నంబు పుట్టించి ప్రజాప్రాణాధారణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహుషాదులు యోగసమాధిష్టితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల వలనం బ్రజలం సముద్ధించిరి గావున.౩౯
లయగ్రాహి.
వారిరుహమిత్రు నమరోరగమునిద్యుచరచారణగణ ప్రణుత చారుగుణు భూతా
ధారు నఖిల శ్రుతిశరీరు హరిశంకరసరోరుహభవప్రతిము దారుణతమిస్రా
వారణమరీచి పరిపూరిత దిగంతరు నఘారి నతికారుణికు సూర్యుఁ ద్రి జగ ద్ర
క్షారతుసహస్రకరుఁ గోరిభజియింపుము మనోరథఫలంబు లగు భూరిభుజనీకున్.౪౦
అని ధౌమ్యుడు ధర్మరాజునకు సూర్యుణ్ణి ఆరాఢించమని చెప్పగా ధర్మరాజావిధంగా చేసి సూర్యునివలన ఒక అక్షయపాత్రను పొంది దానిద్వారా ఆ ౧౨ సంవత్సరములు అతిథిలకు ఆహారాన్ని సమకూద్చుకుంటారు.