Unknown
శల్య పర్వము-ప్రథమాశ్వాసము-1
సంజయుడు ధృతరాష్ట్రునికి దుర్యోధనాదుల మరణము తెలుపుట
సీ.
జననాథ శల్యుండు సమసె సౌబలుడు గీటడఁగె నులూకుండు మడిసె సకల
సంశప్తకులుఁగడచనిరి కాంభోజశతానీకములుఁ దేగటాఱె యవన
పార్వతీయమ్లేచ్ఛ బలములుఁ ద్రుంగె నల్ దిక్కుల మన్నీలుఁ దక్కుఁగలుగు
నరనాయకులును జచ్చిరి కుమారులు కలయందఱుఁ దెగిరి కర్ణాత్మజులును
తే.
బొలిసి రయ్య వృకోదరుపలుకుతప్ప,కుండఁ దద్గదాదండ ప్ర చండనిహతి
రెండుతొడలును విఱిగి ధరిత్రిఁ బెలుచఁ,గూలి రూపఱి రారాజు ధూళి బ్రుంగె.9
ఓ రాజా! శల్యుడు, సౌబలుడు,ఉలూకుడు, అందరు సంశప్తకులు, కాంభోజశతానీకములు,
యవన పార్వతీయమ్లేచ్ఛబలములు, అంతేకాకుండా నాలుగు దిక్కులనుండి వచ్చిన
మన్నీలుడు మొదలుగా నరనాయకులందఱూ, కుమారకులు, కర్ణుని కొడుకులందరూ--
అందరూ చచ్చిరి. భీముడు చేసిన ప్రతిజ్ఞానుసారము ఆతని గదాదండ ప్రచండ నిహతి
రెండు తొడలును విఱిగి నేలకూలి రారాజు రూపుచెడి మన్నులో కలిసిపోయాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment