Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౪
ధర్మరాజు ధౌమ్యునితో నిట్లనియె.
తే.
వనమునకు వచ్చి నవయంగ వల దుడుగుఁ, డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్ వీరికాహార మేయు,పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు.౩౬
వ.
వీరల విడువనోప నేమిసేయుదు ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరాజున కి ట్లనియె.౩౭
ఆ.వె.
భూత రాశి తొల్లి పుట్టి బుభుక్షాభి,తప్త యినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి , కమలభాంధవుండు కరుణ తోడ.౩౮
కమలబాంధవుండు=సూర్యుఁడు
వ.
ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి దక్షిణాయనగతిం బర్జన్యభూతుం డై యోషధులం బడసి రాత్రులయందుఁ జంద్రకిరణాంమృతంబునంజేసి వానిం దడుపుచు వర్ధించి యం దన్నంబు పుట్టించి ప్రజాప్రాణాధారణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహుషాదులు యోగసమాధిష్టితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల వలనం బ్రజలం సముద్ధించిరి గావున.౩౯
లయగ్రాహి.
వారిరుహమిత్రు నమరోరగమునిద్యుచరచారణగణ ప్రణుత చారుగుణు భూతా
ధారు నఖిల శ్రుతిశరీరు హరిశంకరసరోరుహభవప్రతిము దారుణతమిస్రా
వారణమరీచి పరిపూరిత దిగంతరు నఘారి నతికారుణికు సూర్యుఁ ద్రి జగ ద్ర
క్షారతుసహస్రకరుఁ గోరిభజియింపుము మనోరథఫలంబు లగు భూరిభుజనీకున్.౪౦
అని ధౌమ్యుడు ధర్మరాజునకు సూర్యుణ్ణి ఆరాఢించమని చెప్పగా ధర్మరాజావిధంగా చేసి సూర్యునివలన ఒక అక్షయపాత్రను పొంది దానిద్వారా ఆ ౧౨ సంవత్సరములు అతిథిలకు ఆహారాన్ని సమకూద్చుకుంటారు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment