Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౫
భీష్మాది వీరులు దేవదానవాదుల యంశంబు వలనఁ బుట్టుట
సీ.
పరశురాముండు భీకరనిజకోపాగ్ని నుగ్రుఁ డై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్రంబు సేసినఁ దత్క్షత్త్ర సతులు సంతాన కాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్క్షత్త్రమెసఁగి యుర్వి
ఆ.
బర్వి రాజధర్మ పథనీతి విడువక, జార చోర దుష్ట జనులబాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ, జేయుచుండె శిష్ట సేవ్యమగుచు.౫౧
పరశురాముడు ఇరవై వొక్క మాఱులు భూలోకమంతా తిరిగి క్షత్రియులందరిని చంపివేసినపుడు ఆ క్షత్రియ స్త్రీలు ఋతుకాలములో మహావిప్రులవలన ధర్మము తప్పకుండా అనేకమంది కొడుకులను కూతుళ్ళను కన్నారు. వారంతా రాజధర్మాన్ని విడిచిపెట్టకుండా జార చోర దుష్టజనుల బాధ లేకుండా పరిపాలన చేయగా సకల సస్యసమృద్ధి ప్రజాభివృద్ధి జరిగి భూదేవి ప్రజాభారపీడిత అయ్యింది. ఆమె త్రిమూర్తులను భూభారం తగ్గించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు దేవ రాక్షసాంశమ్ములతో పాండవపక్ష వీరులను శిశుపాలాదులు మొదలుగాగల కురురాజుపక్ష రాజులను సృష్టి చేయగా వారందరు భారత సంగ్రామంలో ఒకరితో ఒకరు యుద్ధం చేసి చచ్చిపోతారు. ఆ విధంగా భూభారం తగ్గుతుంది.

బ్లాగ్మిత్రులందరికీ విన్నపం.
--౨౦౦౯ నుండి ప్రారంభించి భక్తి టీ.వి. వారు ప్రతిరోజు రాత్రి గంటలకు, తిరిగి రాత్రి ౧౧ గంటలకు బ్రహ్మశ్రీ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానంతో శ్రీమదాంధ్రమహాభారతాన్ని ప్రసారం చేస్తున్నారు. వీలైతే చూడగలరు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment