Unknown
సభాపర్వము-ప్రథమాశ్వాసము-1
మయుడు మయసభను నిర్మించి పాండవులకిచ్చి వెళ్ళిన తరువాత చాలా మంది మునీశ్వరులు ధర్మరాజును చూడటానికి వస్తారు.
సీ.
సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్యగోపతి గోపవేష మైత్రేయ పవిత్ర పాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞ్యవల్క్య
ఆ.
వాయుభక్ష భార్గవవ్యాస జైమిని, శుక సుమంతు పైల సువ్ర తాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు, రమ్య మయిన ధర్మరాజుసభకు.21

నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట
ఉ.
నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడునొక్కొ యంచు వి
స్మేరమనస్కు లై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి సురేంద్ర మందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్.23

ప్రజలంతా నీరజమిత్రుడు భూమి మీదకు ఎందుకు వచ్చాడో అని ఆశ్చర్యమనస్కులై ఆతని ప్రకాశాన్ని మెచ్చుకొని చూస్తుండగా ఆకాశ మార్గము నుండి నారదుడు ఇంద్రునిమందిరాన్నే తన విలాసముతో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్న అర్జునుని ఇంటికి ప్రేమతో వచ్చాడు.

పర్వత పారిజాత రైవత సుముఖు లను మహా మునులతో కలసి వచ్చాడట నారదుఁడు.25
పర్వములు | edit post
2 Responses
  1. మీరు భారతంలోని ఆణిముత్యాలని ఇలానే ఏరుతూ మా ముందుంచుతూ ఉండాలని నా ఆకాంక్ష.



Post a Comment