Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-4
నారదుడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడగుట(కొనసాగింపు)
క.
క్షితినాధ శాస్త్రదృష్టి, ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్పాత
ప్రతికారు లగుచు స,న్మానితు లయి వర్తింతురయ్య నీ దైవజ్ఞుల్.౩౪

రాజు దగ్గర వుండే దైవజ్ఞులైన పురోహితులు దేవ, అంతరిక్ష, భూమిమీఁదా జరిగే ఉత్పాతాలు మొదలైన వానికి సరియైన ప్రతీకారములను ఆచరించి నీచే సన్మానితులగు చున్నారా అని అడుగుతున్నాడు. రాజు అటువంటి వారిని కలిగి ఉండాలన్నమాట.
క.
అనిశము సేవింతురె ని, న్ననఘా యష్టాంగ మైన యాయుర్వేదం
బున దక్షు లైన వైద్యులు, ఘనముగ ననురక్తులై జగద్ధిత బుద్ధిన్.౩౪

వైద్య విధానాలలో ఆయుర్వేదాని కుండే ప్రాధాన్యత అంత గొప్ప దన్న మాట. రాజు దగ్గర ఆయుర్వేదంలో దక్షులైన వైద్యులు కూడా వుండి తీరాలన్నమాట.

క.
సారమతిఁ జేసి మానస, శారీరరుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయు చుండుదె, యారఁగ వృద్ధోపసేవ నౌషధసేవన్.౩౫

మంచి ఆలోచనతో మానసిక, శారీరక రోగాలకు ఎల్లప్పుడు వృద్ధులకు సేవచేయుట ద్వారానూ, మందులిచ్చుటచేతనూ సరియైన ప్రతీకారము కావించు చున్నావా.
పర్వములు | edit post
0 Responses

Post a Comment