Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-9
మాద్రికి నకులసహదేవులు పుట్టుట
ఉ.
కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రితయంబుఁ గాంచె గాం
ధారియు నక్కడన్ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె నేఁ
బోరచి యాఁడుపుట్టువునఁ బుట్టి నిరర్ధకజీవ నైతి సం
సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్. 129

కుంతికీ సంతానం కలిగింది. అక్కడ గాంధారికి కూడా నూర్గురు కొడుకులు కలిగారు. నాకే సంతానం కలగలేదు
వ.
అని వగచుచు నొక్కఁ నా డేకాంతంబ పతియొద్ద గద్గదవచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు న ట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి మ్మనిన మాద్రికిఁ బాండురాజి ట్లనియె. 130
క.
నావచనమున నపత్యముఁ, గావించును గుంతి నీకు గడు నెయ్యముతో
నీ వగచిన యీ యర్థమ, చూవె మనంబునఁ దలంతుఁ జొలవక యేనున్. 131
చొలవక=విముఖత నొందక
నేనూ దాని గురించే అనుకుంటున్నాను. నా మాటమీద నీకు గుంతి సంతానము కలిగేలా చేస్తుంది. విచారించకు.
వ.
అని పలికి యప్పుడ కుంతీ దేవిం బిలిచి మద్రరాజ పుత్త్రి దయిన మనో వాంఛితంబుఁ జెప్పి సకలలోక కల్యాణకారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు పడయు మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసి మాద్రికి నపత్యంబు వడసిన. 132
ఇక్కడో చిన్న పనికిమాలిన సందేహం. వరం దుర్వాసు డిచ్చింది కుంతికి. ఆమెకు మాత్రమే అది పనిచేయాలి, కాని ఆమె కోర్కెమీద మాద్రికి ఎలా పనిచేసింది అన్నది నా సందేహం. పైగా కవలలు కూడా ఈ సారి .
తే.
కవలవారు సూర్యేంద్రు ప్రకాశతేజు, లాశ్వినుల యంశములఁ బుట్టి రమరగుణులు
వారలకుఁ బ్రీతి నాకాశవాణిసేసె, నకులసహదేవు లన నిట్లు నామయుగము. 133
క.
ఊర్జితులు యుధిష్టరభీ, మార్జుననకులసహదేవు లన నిట్లు వివే
కార్జితయశు లుదయించిరి, నిర్జరులవర ప్రసాదనిర్మితశక్తిన్. 134
ఊర్జితులు=ధృఢవంతులు
ఈ విధంగా కౌరవ పాండన జననం జరిగింది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment