Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౮
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కృత మెఱిఁగి కర్త నుత్తమ, మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు, పతియె జగజ్జనులనెల్లఁ బరిపాలించున్.౪౬

చేయదగినది తెలిసికొని కర్తను సభలలో బాగుగా పొగడి మర్చిపోకుండా తగిన సత్కారమును చేస్తున్నావు గదా. చేయదగినదానిని తెలుసుకున్న రాజే జగాలనన్నీ పరిపాలించగలుగుతాడు.
సీ.
ఆయంబునందు నాలవభాగమొండె మూఁడవభాగమొండె నం దర్థమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవనినాథ యాయుధాగారధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందుఁ బరమవిశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య
ఆ.
గురుల వృద్ధశిల్పివరవణిగ్బాంధవ, జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదరికము వొరయకుండఁగఁ బ్రోతె, సకలజనులు నిన్ను సంస్తుతింప.౪౭
ఆదాయంలో నాల్గవభాగం ఆయుధాగార ధనాగారముల నిర్వహణకు, మూడవభాగాన్ని సైన్యాన్నిఅశ్వదళ నిర్వహణకు,
ఒకటిన్నర భాగాన్ని గజసైన్యనిర్వహణయందు ఖర్చుపెట్టాలి కాని అంతకు మించి ఖర్చు పెట్టరాదనే విషయం గ్రహించావు గదా. ధనాగార నిర్వహణలో దక్షులను భక్తులను పరమ విశ్వాసం గలవారినే నియమించుకొన్నావుగదా.
పర్వములు | edit post
0 Responses

Post a Comment