Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౩
ఉపరిచర వసు మహారాజు వృత్తాంతము
వ.
అట్టి యింద్రోత్సవంబున నతి ప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రధ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱు వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుడయి రాజర్షియయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపంబున బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతియై గిరినిరోధంబుంబాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నింగాఁ జేకొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టుమని తనపితృదేవతలు పంచిన నప్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.౨౬
భారతం లోని ఈభాగాన్ని ఆధారంగా చేసుకుని వసుచరిత్ర కావ్యం రామరాజభూషణునిచే వ్రాయబడిందని చెప్తారు.
సీ.
పలుకులముద్దును గలికి క్రాల్గన్నుల తెలుపును వలుదచన్నుల బెడంగు
నలఘు కాంచీపదస్థలములయొప్పును లలితాననేందు మండలము రుచియు
నళినీల కుటిల కుంతలముల కాంతియు నెల జవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలపును గలుగు నగ్గిరికన తలఁచి తలఁచి
ఆ.వె.
ముదితయందుఁ దనదుహృదయంబు నిలుపుటఁ, జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద,మయ్యె నవనిపతికి నెయ్యమొనర.౨౭
రేతఃస్యందము=ఇంద్రియము పడుట
ఈ రేతస్సునుండి అద్రిక అనే అప్సరస ద్వారా మత్స్యరాజు,మత్స్యగంధి అనే ఇద్దరు పుట్టడం జరుగుతుంది.

పర్వములు | edit post
0 Responses

Post a Comment