Feb
25
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-2
అర్జునుడు ధర్మజున కుచితవచనంబుల మనస్తాపోశమంబుచేయుట
వంశ--
ఆ.
ధర్మ మెడలఁ గృపణకర్మంబుఁ గోరి త,ర్థంబు సువ్వె సకలధర్మ కారి
యొడమి లేనివాఁడు నడపీనుఁ గను నహు,షోక్తి వినమె దాని నూఁదవలదె.49
నీవు వంశధర్మాన్ని(క్షత్రియ ధర్మం) విడిచి పెట్టి నీచమైన ధర్మాన్ని కోరుతున్నావు. ధనమే కదా సకలధర్మాలను కలుగజేసేది. ధనము లేనివాఁడు నడిచే శవము అనే నహుషుని మాట విన్నదే కదా. దాన్నే ప్రమాణంగా స్వీకరించాలి కదా. (డబ్బు లేనివాడు డుబ్బుకు కొఱగాడు -ఇది మన తెలుగు సామెత)
క.
సరిగా నెన్నుదు రార్యులు, దరిద్రునిం బతితునిం గతఘ్నుని జడునిన్
దొరకొను ధర్మముఁ గామముఁ, బరమగతియు నర్థమునన పౌరవముఖ్యా.50
ఓ రాజ్యాధిపతీ - పెద్దలు ధనము గలవానిని సరిగా గుర్తిస్తారు. దరిద్రుని, పతితుడిని, కృతఘ్నుడిని, జడునిని ధర్మము కామము కూడా విడిచిపెడతాయి. ధనము వలననే పరమ ప్రాప్తి కూడా కలుగుతుంది.
క.
కలిమియ చుట్టలఁ జేర్చుంఁ, గలిమియ చెలులను ఘటించుఁ గలిమియ శౌర్యో
జ్జ్వలుఁ డనిపించుం గలిమియ, పలువురు సద్బుద్ధి యనఁగఁ బరఁగం జేయున్.51
కలిమే బంధువులను దగ్గర చేస్తుంది. కలిమే స్నేహితులను కలుపుతుంది. కలిమే అందరిచేతా పరాక్రమ వంతుడనిపించేలా చేస్తుంది.కలిమే ఎక్కువమంది సద్బుద్ధుడని పొగడేలా చేస్తుంది.
క.
ఏవానిబంధుమిత్త్రులు, జీవధనంబులును డప్పిఁ జెందును గృశునిం
గా వాని నెన్నఁగా దగుఁ, గేవలతనుకార్శ్యయుతుఁడు కృశుఁడె నరేంద్రా.52
కేవలం శరీరం మాత్రం కృశించి పోయినవాడు కృశుడుగా పరిగణింప బడడు- ఎవరికి బంధుమిత్రులు, బ్రతకడానికి ఉపయోగపడే ధనము ఉండదో వానినే కృశునిగా ఎన్నుతారు అందరూ.
వ.కావున నర్థోపార్జనంబును బంధుమిత్ర పరితోషణంబును భూపతులకుం బరమ పురుషార్థంబు. అదియునుం గాక ......53
అర్జునుడు ధర్మజున కుచితవచనంబుల మనస్తాపోశమంబుచేయుట
వంశ--
ఆ.
ధర్మ మెడలఁ గృపణకర్మంబుఁ గోరి త,ర్థంబు సువ్వె సకలధర్మ కారి
యొడమి లేనివాఁడు నడపీనుఁ గను నహు,షోక్తి వినమె దాని నూఁదవలదె.49
నీవు వంశధర్మాన్ని(క్షత్రియ ధర్మం) విడిచి పెట్టి నీచమైన ధర్మాన్ని కోరుతున్నావు. ధనమే కదా సకలధర్మాలను కలుగజేసేది. ధనము లేనివాఁడు నడిచే శవము అనే నహుషుని మాట విన్నదే కదా. దాన్నే ప్రమాణంగా స్వీకరించాలి కదా. (డబ్బు లేనివాడు డుబ్బుకు కొఱగాడు -ఇది మన తెలుగు సామెత)
క.
సరిగా నెన్నుదు రార్యులు, దరిద్రునిం బతితునిం గతఘ్నుని జడునిన్
దొరకొను ధర్మముఁ గామముఁ, బరమగతియు నర్థమునన పౌరవముఖ్యా.50
ఓ రాజ్యాధిపతీ - పెద్దలు ధనము గలవానిని సరిగా గుర్తిస్తారు. దరిద్రుని, పతితుడిని, కృతఘ్నుడిని, జడునిని ధర్మము కామము కూడా విడిచిపెడతాయి. ధనము వలననే పరమ ప్రాప్తి కూడా కలుగుతుంది.
క.
కలిమియ చుట్టలఁ జేర్చుంఁ, గలిమియ చెలులను ఘటించుఁ గలిమియ శౌర్యో
జ్జ్వలుఁ డనిపించుం గలిమియ, పలువురు సద్బుద్ధి యనఁగఁ బరఁగం జేయున్.51
కలిమే బంధువులను దగ్గర చేస్తుంది. కలిమే స్నేహితులను కలుపుతుంది. కలిమే అందరిచేతా పరాక్రమ వంతుడనిపించేలా చేస్తుంది.కలిమే ఎక్కువమంది సద్బుద్ధుడని పొగడేలా చేస్తుంది.
క.
ఏవానిబంధుమిత్త్రులు, జీవధనంబులును డప్పిఁ జెందును గృశునిం
గా వాని నెన్నఁగా దగుఁ, గేవలతనుకార్శ్యయుతుఁడు కృశుఁడె నరేంద్రా.52
కేవలం శరీరం మాత్రం కృశించి పోయినవాడు కృశుడుగా పరిగణింప బడడు- ఎవరికి బంధుమిత్రులు, బ్రతకడానికి ఉపయోగపడే ధనము ఉండదో వానినే కృశునిగా ఎన్నుతారు అందరూ.
వ.కావున నర్థోపార్జనంబును బంధుమిత్ర పరితోషణంబును భూపతులకుం బరమ పురుషార్థంబు. అదియునుం గాక ......53
Post a Comment