Unknown
శాంతి ప్వము-ప్రథమాశ్వాసము-4
నకులుడు ధర్మజునకు మనస్తాపోశమంబు చేయుట.
క.
తక్కినమూఁడాశ్రమములు, నొక్క దెస గృహస్థధర్మ మొక దెసఁదులయం
దెక్కింప వానితో , య్యొక్కటి సరిదూగె నందు రుర్వీశ బుధుల్.76

వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు.అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమము. వీనిలో ఒక తక్కెడలో గృహస్థం ఒకవేపు, మిగిలిన మూఢు ఒకవేపు ఉంచి తూచితే గృహస్థాశ్రమం మిగిలిన మూడింటితో సమానంగా తూగినదని పెద్దలు చెపుతారు.అదీ గృహస్థాశ్రమం యొక్క గొప్పదనం.అది మిగిలిన ౩ ఆశ్రమాలకీ ఆధారభూతం.కావున గృహస్థధర్మంబు ఆచరణీయం.
క.
జతనంబున నర్థము సం, చితముగఁ గావించి క్రతువిశేషంబుల దే
వతలం దృప్తులఁ జేయమి, యతికిల్బిషకారి యందు రాగమవేదుల్.78

ప్రయత్నములద్వారా ధనాన్ని బాగుగా కూడబెట్టి క్రతువుల నొనరించుటతో దేవతలను సంతృప్తులను చెయకుండుట ఎక్కువ పాపమును కలిగించునని ఆగమ శాస్త్రవేదులు అంటారు.
క.
పరుల వధింపక యెవ్వఁడు, ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక, యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.81

పూర్వ రాజులలో పరులను వధించకుండా ఏరాజు రాజ్యాన్ని పరిపాలించాడో చెప్పు.వారందరూ సుగతినే పొందారు. నీకూ అలానే చేయటం మంచిది.
క.
రక్ష ప్రజ గోరు నిజయో, గ క్షేమార్థముగ జనసుఖస్థితి నడపన్
దక్షుఁ డగు రాజు నడప కు, పేక్షించినఁ బాప మొందదే కురుముఖ్యా.82

ప్రజలు రాజు వలని రక్షణను కోరుకుంటారు.అందరూ సుఖంగా వుండేలా అందరికి క్షేమం కలిగేలా దక్షుడైన రాజు పరిపాలించాలి, అలా చేయకపోతే పాపము కలుగుతుంది కదా రాజా.
పర్వములు | edit post
0 Responses

Post a Comment