Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౭
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
చోరభయవర్జితముగా, ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవధ్భృత్యవరుల్.౪౨

దొంగలవలని భయం లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నావా? నీ భృత్యులు చోరులనుండి ధనాన్ని గ్రహించి వారిని రక్షించటం లేదుగదా!
క.
ధరణీనాధ భవద్భుజ, పరిపాలిత యైన వసుధఁ బరిపూర్ణము లై
కర మొప్పుచున్నె చెఱువులు, ధరణి కవగ్రహభయంబు దనుకకయుండన్.౪౩
అవగ్రహ=వానలేమివలని
తనుకక
=కలుగక
రాజా! నీరాజ్యంలో చెఱువులన్నీ నీటితో నిండి ఉన్నాయా! వానలేమి భయం లేకుండా అంతా సుభిక్షంగా ఉన్నారుగదా.
చూడండి చెఱువుల ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ఎన్నో ఎన్నెన్నో చెఱువులు కబ్జా అయిపోయి , లేక పూడిపోయి ఉండి వ్యవసాయానికేమాత్రం ఉపయోగపడకుండా ఉంటున్నాయి.
క.
హీను లగు కర్షకులకును, భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న,నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.౪౪

పేదవారైన రైతులకు ధాన్యాన్ని,విత్తనాల్ని అలాగే వర్తకులకు అనూనముగా ఉత్తమ బుద్ధితో ఋణములను ఇస్తున్నావు కదా.
క.
పంగుల మూకాంధుల విక,లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁదశత్రునైనను, సంగరరంగమునఁ గాతె శరణంబనినన్.౪౫

కుంటి,మూగ,అంధ వికలాంగులను, బంధువులెవ్వరూ లేనివారిని దయతో బ్రోచుచున్నావు గదా ! ఆపద కలిగించిన శత్రువునైనా సరే శరణు వేడితే రక్షిస్తున్నావుగదా!
పర్వములు | edit post
0 Responses

Post a Comment