Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౯
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
వలయు నమాత్యులుఁ జుట్టం,బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం
సులు బలసి యుండ నిచ్చలుఁ, గోలువుండుదె లోకమెల్లఁ గొనియాడంగన్.౪౮
క.
పరికించుచు బాహ్యాభ్యం,తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్.౪౯
బయటను లోనను ఉన్న జనుల వలన ఎల్లప్పుడూ జాగరూకుడవై నీ రక్షణను చూసుకుంటూ ఇతర రాజుల కదలికల్ని నేర్పరులైన చారులనెడు కన్నులతో గమనిస్తున్నావు గదా.
క.
వెలయఁగ విద్వజ్జనము,ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార,మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.౫౦
ఆ.వె.
వార్తయందు జగము వర్తిల్లు చున్నది, యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింప వలయుఁ బతికి.
వార్త=అర్థానర్థవివేచన విద్య
పర్వములు | edit post
0 Responses

Post a Comment