Mar
27
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౩
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.
Post a Comment