Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౪
గరుడుడు అమృతాన్నితెచ్చి ఉరగులకిచ్చి తను, తన తల్లి పంచభూతముల సాక్షిగా దాస్యమునుంచి విముక్తి పొందామని చెప్పివారిని శుచిగా స్నానం గట్రా చేసి వచ్చి ఆరగించమని చెప్పి శుభ్రమైన ప్రదేశంలో దర్భలపై అమృతం కలిగిన పాత్రను ఉంచి అక్కడినుంచి తల్లితో సహా వెళ్ళిపోతాడు. వారు శుద్ధులై వచ్చేలోగానే అదృశ్యరూపంలో గరుడుని వెనకాలే వచ్చిన ఇంద్రుడు ఆ పాత్రనక్కడినుండి తీసుకుని స్వర్గానికెళ్ళిపోతాడు.
వ.
అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటం జేసి నాఁటంగోలె ద్విజిహ్వులు నాఁ బరగిరి యమృతస్థితిం జేసి బర్భలు పవిత్రంబు లయ్యె.౧౨౩


తరువాత శేషుడు తన వారు చెసిన పనికి విచారించి వారిని విడిచిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేసి భూభారాన్ని ధరించేలా వరాన్ని పొందుతాడు.తల్లి శాపం వల్ల జనమేజయ సర్పయాగంలో ఉరగులకు గల మరణాన్నించి వాసుకి చెల్లెలైన జరత్కారువునకు జరత్కారుడనే మునీశ్వరునికి పుట్టే ఆస్తీకుడనేవాని వలన రక్షణ కలుగుతుందని బ్రహ్మ చెప్పాడట.
జరత్కారుని చరిత్రము
జరత్కారుడు వివాహానికి విముఖుడై వుంటే ఆతని పూర్వీకులు అతడు సంతానం లేకుండా వుండటం వలన వారికి సద్గతులు కలగటం లేదంటారు. అది తెలిసినవాడై పెళ్లి చేసుకోడానికి సిద్ధపడి తన పేరు వంటి పేరుగల సనామ్నినే చేసుకుంటానంటాడు. అప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు అనే ఆమెతో అతని వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన ఆస్తీకుడే జనమజేయుని సర్పయాగాన్ని విరమింప జేసి సర్పములను రక్షిస్తాడు. ఆ సందర్భంలోని అపుత్రకులకు గతులు కలుగవని చెప్పే పద్యం ఇది.
చ.
తగినసుపుత్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడుఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడఁగఁ జేసియుం బడయ నేర రపుత్రకు లైనదుర్మతుల్.౧౫౦
పర్వములు | edit post
0 Responses

Post a Comment