Unknown
ఆది పర్వము-ప్రథమాశ్వాసము-4
సీ.
ఇమ్మహాభారతం బిమ్ములఁ బాయక విహితావధాను లై వినుచు నుండు
వారికి విపులధర్మార్థారంభసంసిద్ధి యగుఁ బరమార్థంబ యశ్రమమున
వేదముల్ నాలుగు నాదిపురాణముల్ పదునెనిమిదియుఁ దత్ప్రమితధర్మ
శాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్త్వంబులు నెఱిఁగినఫల మగు నెల్లప్రొద్దు
ఆ.
దానములను బహువిధక్రతుహుతజప, బ్రహ్మచర్యములను బడయఁబడిన
పుణ్యఫలము వడయఁ బోలు నశేషపా,పక్షయంబు నగుశుభంబు వెరుఁగు.71

ఈ మహాభారతాన్ని శ్రద్ధగా వినేవారికి అనేక ధర్మార్ధాలను ప్రారంభం చేసిన సిద్ధి
అవుతుంది.శ్రమలేకయె పరమార్థం సిద్ధిస్తుంది. నాలుగు వేదాలు, పద్ధెనిమిది
పురాణాలు, వానిలో చెప్పబడే ధర్మశాస్త్రములు, మోక్షశాస్త్ర తత్త్వములు
తెలుసుకొన్న ఫలం కలుగుతుంది .ఎల్లప్పుడూ దానములను, బహువిధమైన
క్రతువులను, జపము బ్రహ్మచర్యము వలనికలుగు పుణ్యఫలము కలుగుతుంది.
పాపాలు నశిస్తాయి. శుభాలు పెరుగుతాయి.
ఉ.
సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.72

వ్యాసుఁడనెడి యాకాశమునుండి దేవేంద్రుడనెడి సముద్రమును కలసి
శోభనుపొందు జగద్విదితమగు భారతీయభారతి అనబడే దేవనదీ
ప్రవాహము నిరంతరము విన్నవారికి, కొనియాడిన వారికందరికీ
సంతతమైన పుణ్యసంపదలను అధికంగా అభివృద్ధి నొందిస్తుంది .


పర్వములు | edit post
2 Responses
  1. Anonymous Says:

    బర్బరీకుడి గురించి వివరాలు చెప్పగలరా?


  2. Unknown Says:

    కొంచెం సమయమివ్వండి.ప్రయత్నిస్తాను.


Post a Comment