Unknown
సభా పర్వము-ప్రథమాశాస్వము-౨
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట
భారతంలో చాలా చోట్ల వివిధములైన ధర్మాలను చెప్పటం జరిగింది.
ఈ సందర్భంలో నారదుడు ధర్మరాజుని అడిగినట్లు పరోక్షంగా వివిధములైన
రాజధర్మాలను ఉపదేశించటం జరిగింది.

సీ.
మీ వంశమున నరదేవోత్తముల దైన సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మ విదుండ వై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గాఁ జేసి సేవింతె ధర్మవునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపర రాత్రమ్ములం దెప్పుడుఁ జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన
ఆ.
రాజకృత్యములఁ దిరంబుగా నిఖిల ని, యోగవృత్తులందు యోగ్యు లయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె, నీవు వారి దయిమ నే ర్పెఱింగి.26

ఓ ధర్మరాజా! మీ వంశమున రాజశ్రేష్ఠులదైన సద్ధర్మమార్గాన్ని సలుపుతున్నావా!
ధర్మవిదుడవై ధర్మార్థకామాలు ఒకదానితో నొకటి బాధింపబడకుండగా కాల
విభజనం చేసి సేవిస్తున్నావా! ధర్మమునందే మనస్సును నిలిపి రాత్రి నాల్గవ
జాములో చింతన చేస్తున్నావా! స్వబుద్ధితో చేయదగిన రాజకార్యాలు ఎవరు
ఏయే పనులు చేయసమర్థులో వారి వారి నాయా కార్యాలలో సరిగా గౌరవముతో
చేయటానికి నియమించావా!
(ఇంకావుంది)
పర్వములు | edit post
0 Responses

Post a Comment