Unknown
ద్రోణ పర్వము
సంజయుడు యుద్ధవృత్తాంతం ధృతరాష్ట్రునికి చెప్పుట
ధృతరాష్ట్రుడు సంజయునితో--
చ.
అమరనదీతనూజు సమరావనిఁ గోల్పడి నాదుయోధవ
ర్గము మఱి యెవ్వరిం గొని పరాక్రమదుర్దమపాండుపుత్ర సై
న్యమునకు మార్కొనం దలఁచె నక్కట కౌరవు లేమిచేసి రా
సమయమునన్ బలప్రచయసంఘటనం బెటులయ్యె సంజయా.

భీష్ముని తరువాత నా సైన్యము ఎవరి సారధ్యంలో ఫాండవులను ఎదుర్కొన్నది.కౌరవులు ఏమి చేసారు. అప్పుడేమి జరిగింది- అని సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment