Mar
02
ఆశ్రమవాస పర్వము-ప్రథమాశ్వాసము-1
సుమారు ౧౫ సంవత్సరములు గడచిన పిమ్మట ఒకనాడు--
ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దన మనోరథంబు తెలుపుట
సీ.
ఏ కార్య మైనను నెవ్వఁడేనియుఁ జేయఁ దొడఁగునప్పుడు విను పుడమి ఱేని
చే ననుజ్ఞాతుఁడై కాని తొడంగఁ గా దట్లు కావున వార్ధకాభిలీఢ
మైన మదీయకాయమునకు సంస్కార మాచరింపఁగఁ దపమాచరించు
పనికి భూపాల నీయనుమతి పడయంగ వలసి చెప్పెద రాజవంశజునకు
ఆ.
సమరమరణ మొండె విమలతపమునకుఁ, జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె
వలయు నస్మదీయకులముఖ్యు లిట్టుల, నడపి రనుపు నన్ను నడవి కనఘ.27
ఎవరైనా ఏపనైనా చేయాలనుకున్నపుడు రాజానుమతితో కాని ఇంకో విధంగా చేయకూడదు.
కాన ముసలితనముచే పూర్తిగా తినబడిన నా శరీరాన్ని సంస్కారించుకొనే నిమిత్తం తపస్సు
చేసుకోవడానికి నీ అనుజ్ఞ కావలసి చెపుతున్నాను విను. రాజవంశంలో పుట్టినవానికి
యుద్ధంలో గాని, తపస్సు ద్వారా కాని చావాల్సి వుంది. నా కులం లోని
కులముఖ్యులందరూ ఇలానే చేసారు. అందుచేత నన్ను అడవికి పంపించు.
క.
రాజు గురుఁ డెల్లవారికి, రాజోత్తమ గురునియాజ్ఞ రంజిల్లఁగఁ బే
రోజం జేసినకృత్యము, సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్.28
రాజు ఎల్లవారికి గురుడు.రాజోత్తమా గురునియాజ్ఞ రంజిల్లునట్లుగా పేరోజం(?)
చేసిన కార్యమే రెండు లోకాల్లోనూ శోభను కూర్చుతుంది.
అనగా ధర్మరాజు మొదట్లో ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడు తాము తపస్సుకు వెళ్ళటానికి
ఒప్పుకోకపోతే అన్నం తిననంటాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చి
ధృతరాష్ట్రాదులకు అనుమతిని ఇమ్మని ధర్మరాజుకు సూచిస్తాడు.
దానికి ధర్మరాజు ఒప్పుకోవటం జరుగుతుంది.
సుమారు ౧౫ సంవత్సరములు గడచిన పిమ్మట ఒకనాడు--
ధృతరాష్ట్రుఁడు ధర్మజునితోఁ దన మనోరథంబు తెలుపుట
సీ.
ఏ కార్య మైనను నెవ్వఁడేనియుఁ జేయఁ దొడఁగునప్పుడు విను పుడమి ఱేని
చే ననుజ్ఞాతుఁడై కాని తొడంగఁ గా దట్లు కావున వార్ధకాభిలీఢ
మైన మదీయకాయమునకు సంస్కార మాచరింపఁగఁ దపమాచరించు
పనికి భూపాల నీయనుమతి పడయంగ వలసి చెప్పెద రాజవంశజునకు
ఆ.
సమరమరణ మొండె విమలతపమునకుఁ, జొచ్చి యందు నిలిచి చచ్చు టొండె
వలయు నస్మదీయకులముఖ్యు లిట్టుల, నడపి రనుపు నన్ను నడవి కనఘ.27
ఎవరైనా ఏపనైనా చేయాలనుకున్నపుడు రాజానుమతితో కాని ఇంకో విధంగా చేయకూడదు.
కాన ముసలితనముచే పూర్తిగా తినబడిన నా శరీరాన్ని సంస్కారించుకొనే నిమిత్తం తపస్సు
చేసుకోవడానికి నీ అనుజ్ఞ కావలసి చెపుతున్నాను విను. రాజవంశంలో పుట్టినవానికి
యుద్ధంలో గాని, తపస్సు ద్వారా కాని చావాల్సి వుంది. నా కులం లోని
కులముఖ్యులందరూ ఇలానే చేసారు. అందుచేత నన్ను అడవికి పంపించు.
క.
రాజు గురుఁ డెల్లవారికి, రాజోత్తమ గురునియాజ్ఞ రంజిల్లఁగఁ బే
రోజం జేసినకృత్యము, సూ జగములు రెంటియందు శోభన మిచ్చున్.28
రాజు ఎల్లవారికి గురుడు.రాజోత్తమా గురునియాజ్ఞ రంజిల్లునట్లుగా పేరోజం(?)
చేసిన కార్యమే రెండు లోకాల్లోనూ శోభను కూర్చుతుంది.
అనగా ధర్మరాజు మొదట్లో ఒప్పుకోడు. ధృతరాష్ట్రుడు తాము తపస్సుకు వెళ్ళటానికి
ఒప్పుకోకపోతే అన్నం తిననంటాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చి
ధృతరాష్ట్రాదులకు అనుమతిని ఇమ్మని ధర్మరాజుకు సూచిస్తాడు.
దానికి ధర్మరాజు ఒప్పుకోవటం జరుగుతుంది.
Post a Comment