Unknown
మౌసల పర్వము-ఏకాశ్వాసము-1
ధర్మజు రాజ్యంబున నుత్పాతంబులు తోఁచుట

సీ.
భారతసంగ్రామపారీణుఁడై జయరమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ బాండవముఖ్యునిఁ బట్టంబు కట్టినయది ,యాది కాఁగ ముప్పదియు నైదు సంవత్సరంబులు చన ననంతరవత్సరంబునఁ బ్రజకు భయం బొనర్చు నుత్పాతములు పుట్టె నుర్వీశ విను మహావాయువు శర్కరావర్షి యగుచు
ఆ.
వీచు నర్కు నుదయవేళల బింబంబు, బలసి తోఁచు ఘనకబంధసమితి నీరదములు లేక నిర్ఘాతపాతముల్, కలుగు నుల్క లెల్లకడల డుల్లు.3

భారతసంగ్రామానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడైన ముప్పది ఐదు సంనత్సరములు చనిన పిమ్మట తరువాతి సంవత్సరంలో ప్రజలకు భయం కలిగించే అనేక ఉత్పాతములు పుట్టినవి. గులకరాళ్ళవర్షం, సూర్యుని ఉదయాస్తమయ సమయాల్లో బింబము మరీ పెద్దదిగాను, మబ్బునీరు మొత్తము మేఘములు లేకుండగనే పెద్ద వర్షంగా ఆపులేకుండా కురియటం, ఉల్కాపాతములు మొదలగునవి కలిగేవి.
సీ.
యిట్లనుదినమును నెన్నియేనియును మహోత్పాతములు పుట్టుచుండఁ గొంత కాలంబు పోవఁగఁ గౌంతేయముఖ్యుండు వినియె నొండొరులతోఁ బెనఁగి సర్వ యాదవులును దెగి రంభుజనాభుండు హలధరుండు దక్క నని నరేంద్ర విని భీమసేనుని వివ్వచ్చు నకులుని సహదేవు రావించి సంభృతార్తి
తే.
యగుచు నవ్వార్త యెఱింగించె నందఱకును, వారలేవురు నెవ్వగల్ కూరుమాన
సములు కలఁగ నత్యంతవిషణ్ణు లైరి, సకలజనకోటులును శోకజలధి మునుఁగ.
5
పర్వములు | edit post
0 Responses

Post a Comment