Unknown
భీష్మ పర్వముప్రథమాశ్వాసము-1
ధృతరాష్ట్రునికడకు వేదవ్యాసుండు వచ్చుట
ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుడు వచ్చిఆతని అర్చనలు స్వీకరించి అతనితో --
క.
కాలం బగుటయు నృపులకు, నాలము సమకూడె దీని కడలకు మది నీ
వాలోకింపఁగ వలసిన, నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్రా.6
రాజులందరికీ కాలం మూడటం వలన ఈ యుద్ధము వచ్చింది. దీనికి బాధ పడకుము. ఈ యుద్ధం నీవు చూడదలచిన నీకు దివ్యదృష్టి నిస్తాను అనగా అతడు యుద్ధాన్ని చూడదలచలేదు, కాని దానిని గురించి వినాలని వుంది అంటాడు.
అప్పుడు వ్యాసభగవానుడు సంజయునికి యుద్ధం గురించి సర్వమూ విదితమయ్యే లాగున వరమిస్తాడు. సంజయుడు యుద్ధాన్ని మొత్తం చూచివచ్చి ధృతరాష్ట్రునికి చెపుతుంటాడు ఆ వర ప్రభావంతో.
పర్వములు | edit post
0 Responses

Post a Comment